సీఎం లేఖ రాయగానే కేంద్రం స్పందించింది: జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు.
“ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని తెలిపారు జీవీఎల్. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే, సరిగ్గా స్పందించ లేదని పేర్కొన్నారు. “విపత్తు సహాయ నిధి” కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని జీవీఎల్ ప్రశ్నించారు. కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన అన్నారు.
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదు? భాధితులను ఎందుకు సీఎం ఓదార్చే ప్రయత్నం చేయడం లేదంటూ జీవీఎల్ మండిపడ్డారు. ప్రజల వద్దకు పోకుండా, ప్యాలెస్ నుంచి పాలన చేయాలని నిర్ణయించుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి, సహాయక చర్యలు ప్రారంభిం చాలి. రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదోవపట్టకుండా…. వెంటనే బాధితుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వెంటనే బీసీ కులాల జనాభా లెక్కింపు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్, టీడీపీ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం “జలజీవన్ మిషన్” ను సరిగా సద్వినియోగం చేసుకుని, అమలు చేయని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ… ప్రజలను అప్రమత్తం జాగృతం చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేవలం అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందా? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు.
- Tags
- ap
- bjp
- Floods
- GVL Narasimha Rao
- jagan
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!