సీఎం లేఖ రాయగానే కేంద్రం స్పందించింది: జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు.
“ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని తెలిపారు జీవీఎల్. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే, సరిగ్గా స్పందించ లేదని పేర్కొన్నారు. “విపత్తు సహాయ నిధి” కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని జీవీఎల్ ప్రశ్నించారు. కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన అన్నారు.
Also Read
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదు? భాధితులను ఎందుకు సీఎం ఓదార్చే ప్రయత్నం చేయడం లేదంటూ జీవీఎల్ మండిపడ్డారు. ప్రజల వద్దకు పోకుండా, ప్యాలెస్ నుంచి పాలన చేయాలని నిర్ణయించుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి, సహాయక చర్యలు ప్రారంభిం చాలి. రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదోవపట్టకుండా…. వెంటనే బాధితుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వెంటనే బీసీ కులాల జనాభా లెక్కింపు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్, టీడీపీ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం “జలజీవన్ మిషన్” ను సరిగా సద్వినియోగం చేసుకుని, అమలు చేయని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ… ప్రజలను అప్రమత్తం జాగృతం చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేవలం అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందా? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు.
- Tags
- ap
- bjp
- Floods
- GVL Narasimha Rao
- jagan
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!