మంత్రి అంటే అభిమానులు.. అనుచరులు కామన్. కొందరు మంత్రి చెప్పిన పనిచేస్తే.. ఇంకొందరు తమ అభిమాన నేతపై ఈగ వాలితే సహించలేరు. ప్రస్తుతం ఆ మినిస్టర్ విషయంలో అదే జరుగుతోందట. అభిమానం తలనొప్పులు తెచ్చిపెడుతోందని టాక్. తాజా ఎపిసోడ్లో విపక్షాలకు టార్గెట్గా మారి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆ అమాత్యులవారు. సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనతో రచ్చ రచ్చ..! బాలినేని శ్రీనివాస్రెడ్డి. ఏపీ మంత్రి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన చుట్టూనే విమర్శలు.. ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. గతంలోనూ ఆయన…
అశోక్ గజపతి రాజుపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అశోక్ గజపతి రాజు లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని… కనీస సంస్కృతి, సంప్రదాయాలు తెలియని వ్యక్తిలా ఆయన వ్యవహరించారని నిప్పులు చెరిగారు. ఇదేనా ఆయన పెంపకం…వారి తల్లిదండ్రులు ఇదే నేర్పించారా?? అని నిలదీశారు. జిల్లాలో ఏనాడు ఇలాంటినీచమైన సాంప్రదాయాలు జరగలేదని.. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ రోజు ఒక లెటర్ కూడా రాయలేదని మండిపడ్డారు. ఏ రోజు తన విలువులు కాపాడు…
విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు ఊహించని అవమానం జరిగింది. అశోక్ గజపతిరాజును కొబ్బరి కాయ కూడా మంత్రి వెల్లం పల్లి కొట్ట నివ్వకుండా రచ్చ చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు… ఆందోళనకు దిగారు. శిలా ఫలకం బోర్డు ను తొలగించే ప్రయత్నం చేశారు పూసపాటి అశోక్ గజపతి రాజు. ఈ సందర్భంగా.. అశోక్ గజపతి రాజు…
మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను….’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సుబ్బారావు గుప్తాపై దాడిచేసిన సుభానీపై పోలీసులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. సుబ్బారావు గుప్తాపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత సుభానీని వన్ టౌన్ పోలీసులు…
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై…
మరోసారి తెలుగుతమ్ముళ్లపై తీవ్ర స్థాయిలో కొడాలినాని విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ పై ధ్వజమెత్తారు. ఎవ్వరరూ ఏమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆయన వెల్లడించారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ చేపట్టామని ఆయన అన్నారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. అమరావతి కూడా ఉంటుందని నాని వ్యాఖ్యానించారు. కేవలం…
ఒక్క రూపాయి కట్టొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు ? అని అచ్చెన్నాయుడు కు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బెజవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్ధాపనలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తుంటాయి..వారు చేయరు చేసే వాళ్లు చేయనివ్వరని మండిపడ్డారు. జగనన్న శాశ్వత గృహ పథకాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని మండి పడ్డారు. ఇళ్ల…
రాజధాని వికేంద్రీకరణ, అమరావతిపై మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. సెక్రటరియేట్ విశాఖలో, హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని… అమరావతి కూడా ఉంటుందని క్లారిటీఇచ్చారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజదాని వికేంద్రీకరణ అని… అమరావతి అందరిది అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని… కానీ రియల్…
రేపు జగన్ 49వ పుట్టిన రోజును పురస్కరించుకుని పాటల విడుదల చేయనున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి. రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు కార్యకర్తలు, నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపొందించనున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. పాటల వీడియో విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, ఇతర నేతలు విడుదల చేశారు.…
వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీసీ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. అక్కడక్కడే పరిష్కరించే సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన…