సీఎం జగన్ అమూల్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు: దూళిపాళ్ల నరేంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ర్టంలోని పాడి రైతులను మోసగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 1950, 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. అమూల్ కోసం రూ.2,500ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెడుతున్న జగన్.. మూతపడిన ఒంగోలు డెయిరీకి రూ.150 కోట్లు కేటాయించ లేరా..? అంటూ ప్రశ్నించారు. దాదాపు 30 వేల మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also:ఇళ్ల మధ్యలో పబ్ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఆయన లెక్కప్రకారం అమూల్ సంస్థ లీటర్ పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి రూ.70లు అని చెప్పడం పచ్చి అబద్ధం కాదా? అంటూ విమర్శించారు. విజయ డెయిరీ 11 శాతమున్న లీటర్ పాలకు రూ.85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77లు మాత్రమేనని పేర్కొన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయన్నారు. కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆయన వెల్లడించారు.
పశువుల బీమాకు సంబంధించిన సొమ్ముని ఎగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం, గోపాల మిత్రల భవిష్యత్తును అంధకారం చేసేలా ప్రయత్నాలు చేస్తుందన్నారు. పశువైద్యులు వైద్యసేవలకు స్వస్తి పలికి, ప్రభుత్వం చెప్పే అడ్డమైన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని నరేంద్ర దుయ్యబట్టారు. సేవాభావంతో పశువుల దాణా అమ్మేవారు ప్రభుత్వానికి రూ. 25వేల డిపాజిట్ కట్టాలనడం దుర్మార్గం కాదా? చిన్నచిన్న సొసైటీలు రూ.25వేలు కట్టేస్థితిలో ఉంటాయా అనే ఆలోచన సీఎంకు లేకపోవడం సిగ్గుచేటు చర్యగా నరేంద్ర పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?