మాజీ ఆర్థిక మంత్రి యనమలకు తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తుని నుంచి యనమల కుటుంబం లేదా ప్రత్యర్ధి ఎవరైనా 15 వేలు మెజారిటీతో గెలుస్తాను. 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని పేర్కొన్నారు. నాపై గెలుపు సంగతి అలాఉంచి నాకు 15వేలు మెజారిటీ రాకుండా చూసుకోండి అని సవాల్ విసిరారు. ఐటీజే తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన…
విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సీఎం జగన్ గతంలోనే చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్…
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేత విష్ణు వర్ధన్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సీఎంను హత్య చేస్తారని వైసీపీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదన్నారు. Also read: రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం… సీఎం ను కాపాడుకోలేని వాళ్లు ప్రజలను ఎలా కాపాడుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు…
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం.…
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు చంద్రబాబు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి ప్రైవేటీకరణకు ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151…
కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తోంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనానికి జనసేనే గుర్తుకు రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని మేం శత్రువుగా చూడడం లేదు.. కానీ ఆ ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే మేం విమర్శలు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే పచ్చి బూతులు తిడతారు.. ఇంట్లో వాళ్లని తిడతారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏదో చిన్న పరిశ్రమ కాదు.. ఆత్మగౌరవం. నేను బీజేపీతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవాలని…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యరు. కుప్పం ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏంటని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వెన్నుపోటుల గురించి చంద్రబాబు చెప్పడమేంటని ఆయన అన్నారు. పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్ను పోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా…
ఆ నియెజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు..? ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవరిని కలవాలి..? తాము ఓట్లేసి గెలిపించిన నేతను కలవలేక పోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేస్తున్న నేత ఎవరు? శాసనసభ్యునికంటే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆవ్యక్తికి అంత క్రేజ్ ఎందుకు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎచ్చెర్లలో షాడో ఎమ్మెల్యేగా కిరణ్ మేనల్లుడు సాయి..!? గొర్లె కిరణ్కుమార్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే. బయట వ్యక్తులు ఈ పేరే చెబుతారు. అదే ఎచ్చెర్ల నియెజకవర్గం…
ఆయనో అధికారపార్టీ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. కాకుంటే కాస్త డిఫరెంట్. పార్టీలో ఉంటారు.. అప్పుడప్పుడూ పార్టీకి గిట్టని పనులు కూడా చేస్తుంటారు. మరోసారి టికెట్ రాదని అనుమానం వచ్చిందో ఏమో .. ముందే జాగ్రత్త పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను అందుకు సంకేతాలుగా చెబుతున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే కొత్తదారిలో ప్రయాణిస్తారా? కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీరుపై వైసీపీలోనే అసంతృప్తి ఉందా? కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఆయన…