బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది.…
PMUY Scheme: కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వలా యోజనను మరింత విస్తరించాలన్న నేపథ్యంలో కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు అందించనుంది. మహిళా సాధికారతకు తోడ్పడే ఈ నిర్ణయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా.. నవరాత్రి పవిత్ర సందర్భంలో, ఉజ్జ్వల కుటుంబానికి చెందిన తల్లులు, అక్కచెల్లలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పని వల్ల వారు ఈ పండుగ రోజు ఆనందాన్ని పొందడమే కాక, మహిళా…
మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
Om Birla: మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ‘‘మహిళా సాధికారత సదస్సు’’లో ఆయన మాట్లాడారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశము కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వారు ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. Read Also: Motel Killing: డల్లాస్ ‘‘నాగమల్లయ్య’’ హత్యతో ప్రవాసుల్లో భయం..…
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది.
Upasana : మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లైఫ్, హెల్త్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ద ఖాస్ ఆద్మీ పేరుతో తన లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. తాజాగా డబ్బు, హోదా, జీవితం, విజయాలు, పొజీషన్, విలువల గురించి రాసుకొచ్చింది. ఈ సమాజం ఆడవారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. అనకువతో ఉండాలనే చెబుతుంది. అంతేగానీ విజయాలు సాధించమని ప్రోత్సహించదు. నేను సాధించిన…
Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ…
CM Chandrababu: స్త్రీ శక్తి పథకం యొక్క మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణి లను గౌరవించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 2.02 కోట్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం కోసమే ఈ పథకం తెచ్చాం.. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటాం..
Deputy CM Pawan: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బలమైన అకుంఠిత దీక్ష ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు.. మన రాష్ట్ర ఆడపడుచులకు ప్రత్యేక ధన్యవాదాలు.
Nara Lokesh: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా మహిళలే.. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు అవకాశం కల్పించారు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.