Minister Seethakka : బ్యాంకులకు మహిళా సంఘాల ద్వారా 98 శాతం రీపేమెంట్
- "కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి" – మంత్రి సీతక్క
- మహిళా సంఘాలకు రుణాలు, బీమా, వ్యాపార అవకాశాలు
- ఉచిత బస్సు ప్రయాణం, ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లపై వివరాలు
- బీఆర్ఎస్పై మండిపడ్డ సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. సీతక్క మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ. ఇందిరమ్మ కాలంలోనే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఉక్కుమహిళగా నిలిచిన ఇందిరా గాంధీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ – ఇద్దరూ మహిళల సాధికారతకు ప్రతీకలు” అని అన్నారు.
H-1B visa: ట్రంప్ H-1B వీసా నిబంధనలతో ఎవరిపై ప్రభావం .? ఎవరిపై ఉండదు..?
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
“గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. నేడు ప్రతి ఏడాది 25 వేల కోట్ల బ్యాంకు రుణాలు మహిళలకు ఇస్తున్నాం. ఆ రుణాలతో మహిళలు పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల ద్వారా నడిచే వ్యాపారాలు కోట్లలో ఆదాయాన్ని రాబడుతున్నాయి” అని సీతక్క వివరించారు. నారాయణపేట మహిళా సంఘం ఆరు నెలల్లోనే 13.80 లక్షల ఆదాయం సంపాదించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 35 ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్లు మహిళల ద్వారానే నడుస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా.. “ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మహిళా సంఘాలను ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులుగా చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్లు కూడా మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నారు. దీంతో వారికి ఏటా 30 కోట్ల ఆదాయం వస్తోంది. మహిళా సంఘ సభ్యుల కోసం 10 లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లోన్ బీమా కల్పించాం. ఇప్పటి వరకు 40 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాం” అని వివరించారు. “బీఆర్ఎస్ మహిళలతో దుర్మార్గంగా వ్యవహరించింది. మహిళల 1,800 కోట్ల పొదుపు డబ్బులను కూడా మింగేసింది. నాసిరకం బతుకమ్మ చీరలు ఇచ్చి మహిళలను అవమానపరిచింది.
ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పై తప్పుడు వీడియోలు సృష్టించి మోసం చేయాలని చూస్తోంది. బతుకమ్మ పండుగను రాజకీయాలతో కలుషితం చేస్తోంది. మహిళలు ఇకపై మోసపోవద్దు” అని ఆమె పిలుపునిచ్చారు. “కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి మహిళా సంఘం ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా నిలబెడతాం. మహిళలు బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, దేశం బలంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి” అని సీతక్క అన్నారు.
India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!