Singareni : మహిళల కోసం సింగరేణి చరిత్రలో తొలిసారి ఓపెన్ కాస్ట్ మైన్స్ అవకాశం!
- సింగరేణి మహిళలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆపరేటర్గా అవకాశం
- 35 ఏళ్ల లోపు, కనీస ఏడవ తరగతి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి అర్హత
- ఎంపిక ప్రక్రియ: కమిటీ పరిశీలన, శిక్షణ, ఎంపిక పరీక్ష
- మహిళల సాధికారత, సమాన అవకాశాల కోసం సింగరేణి తొలి అడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇది సింగరేణి చరిత్రలో మహిళలకు ప్రత్యక్షంగా మైనింగ్ ఆపరేషన్లో భాగంగా చేరే తొలిసారి అవకాశం అని యాజమాన్యం పేర్కొంది. సింగరేణి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం మాట్లాడుతూ, మైనింగ్ రంగంలో మహిళల సాధికారతను పెంపొందించడం, సమాన అవకాశాలను కల్పించడం, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలకు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి, కనీసం ఏడవ తరగతి పాసు ఉండాలని యాజమాన్యం సూచించింది. అలాగే, శారీరకంగా సామర్థ్యం కలిగి ఉండాలి, ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆగస్టు 2024కి ముందే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తులు సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతి లేదా జనరల్ మేనేజర్ వద్ద సమర్పించవచ్చని సర్క్యులర్లో స్పష్టం చేశారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
దరఖాస్తులను స్వీకరించిన తర్వాత, జనరల్ మేనేజర్ సీపీపీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ అభ్యర్థులను పరిశీలించి కనీస అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో శిక్షణ పొందాలి. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఖాళీల లభ్యతను బట్టి నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని సీనియర్ ఎపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ-5 డిసిగ్నేషన్తో సంబంధిత ఏరియాలకు నియమిస్తారు.
సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం ద్వారా మహిళా ఉద్యోగులకు మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం, సమాన అవకాశాలు మరియు సామర్థ్య ప్రదర్శనకు మద్దతుగా నిలిచే విధంగా ముందుకు వచ్చినట్టు స్పష్టం చేసింది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరుతోంది.
India’s Big Sports Day: క్రికెట్లో పాక్.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్కు డబుల్ ‘పరీక్ష’..!
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!