Singareni : మహిళల కోసం సింగరేణి చరిత్రలో తొలిసారి ఓపెన్ కాస్ట్ మైన్స్ అవకాశం!
- సింగరేణి మహిళలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆపరేటర్గా అవకాశం
- 35 ఏళ్ల లోపు, కనీస ఏడవ తరగతి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి అర్హత
- ఎంపిక ప్రక్రియ: కమిటీ పరిశీలన, శిక్షణ, ఎంపిక పరీక్ష
- మహిళల సాధికారత, సమాన అవకాశాల కోసం సింగరేణి తొలి అడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇది సింగరేణి చరిత్రలో మహిళలకు ప్రత్యక్షంగా మైనింగ్ ఆపరేషన్లో భాగంగా చేరే తొలిసారి అవకాశం అని యాజమాన్యం పేర్కొంది. సింగరేణి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం మాట్లాడుతూ, మైనింగ్ రంగంలో మహిళల సాధికారతను పెంపొందించడం, సమాన అవకాశాలను కల్పించడం, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలకు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి, కనీసం ఏడవ తరగతి పాసు ఉండాలని యాజమాన్యం సూచించింది. అలాగే, శారీరకంగా సామర్థ్యం కలిగి ఉండాలి, ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆగస్టు 2024కి ముందే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తులు సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతి లేదా జనరల్ మేనేజర్ వద్ద సమర్పించవచ్చని సర్క్యులర్లో స్పష్టం చేశారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
దరఖాస్తులను స్వీకరించిన తర్వాత, జనరల్ మేనేజర్ సీపీపీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ అభ్యర్థులను పరిశీలించి కనీస అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో శిక్షణ పొందాలి. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఖాళీల లభ్యతను బట్టి నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని సీనియర్ ఎపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ-5 డిసిగ్నేషన్తో సంబంధిత ఏరియాలకు నియమిస్తారు.
సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం ద్వారా మహిళా ఉద్యోగులకు మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం, సమాన అవకాశాలు మరియు సామర్థ్య ప్రదర్శనకు మద్దతుగా నిలిచే విధంగా ముందుకు వచ్చినట్టు స్పష్టం చేసింది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరుతోంది.
India’s Big Sports Day: క్రికెట్లో పాక్.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్కు డబుల్ ‘పరీక్ష’..!
తాజావార్తలు
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?