Nara Lokesh: నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది.. మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు..!
- ఎన్టీఆర్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు..
- మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు..
- సినిమాలు, వెబ్ సిరీస్లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు తీసేయ్యాలి..
- నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది: మంత్రి లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా మహిళలే.. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు అవకాశం కల్పించారు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ప్రతిభా భారతిని మొదటి మహిళా స్పీకర్ ను చేసింది చంద్రబాబు అన్నారు. ఇక, విద్యార్ధులలో సైతం ఆడపిల్లలే మొదటి స్థానంలో ఉన్నారు.. 85 శాతం ఉత్తమ విద్యార్ధులు ఆడపిల్లలే.. 3600 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చాం.. మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Andhra pradesh : నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
అయితే, 1992లో హెరిటేజ్ సంస్థను మా నాన్న ప్రారంభించి మా అమ్మకు అప్పజెప్పారు.. ఇవాళ రూ. 5 వేల కోట్ల విలువైన కంపెనీ మా అమ్మ నడిపిస్తోంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక, నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది.. మహిళా భద్రత ఉండాలంటే వారిని గౌరవించాలి.. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు భారం తగ్గుతుంది.. నెలకు కనీసం రూ. 1500 భారం తగ్గుతుందన్నారు. ధన దాహం కోసం గత ఐదేళ్ళు విషంతో సమానమైన మద్యం ఇచ్చి మహిళల తాళిబొట్లు తెంపారు.. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు.. ముందు ఇంట్లోని తల్లి చెల్లికి న్యాయం చేసి మా గురించి ఆలోచించాలని హెచ్చరిస్తున్నాను.. పరిశ్రమలు గత ఐదేళ్ళలో పక్క రాష్ట్రాలకు తరలించారు మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
Read Also: Massive Cloudburst: స్వాతంత్ర్య దినోత్సవం వేళ మృత్యుఘోష.. 65కు చేరిన మృతుల సంఖ్య..
ఇక, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్లతో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అని మంత్రి లోకేష్ తెలిపారు. మిస్సైల్ మోడీ ఆపరేషన్ సింధూర్ తో తగిన గుణపాఠం చెప్పారు.. మురళీ నాయక్ ను కోల్పోయాం.. మురళీ నాయక్ తన కుంటుంబానికి భారతదేశం అండగా ఉంటుందన్నారు. అయితే, సినిమాలు, వెబ్ సిరీస్ లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఉంటే తీసి వేయ్యాలి అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!