Nara Lokesh: నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది.. మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు..!
- ఎన్టీఆర్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు..
- మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు..
- సినిమాలు, వెబ్ సిరీస్లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు తీసేయ్యాలి..
- నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది: మంత్రి లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా మహిళలే.. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు అవకాశం కల్పించారు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ప్రతిభా భారతిని మొదటి మహిళా స్పీకర్ ను చేసింది చంద్రబాబు అన్నారు. ఇక, విద్యార్ధులలో సైతం ఆడపిల్లలే మొదటి స్థానంలో ఉన్నారు.. 85 శాతం ఉత్తమ విద్యార్ధులు ఆడపిల్లలే.. 3600 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చాం.. మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Andhra pradesh : నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
Also Read
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
అయితే, 1992లో హెరిటేజ్ సంస్థను మా నాన్న ప్రారంభించి మా అమ్మకు అప్పజెప్పారు.. ఇవాళ రూ. 5 వేల కోట్ల విలువైన కంపెనీ మా అమ్మ నడిపిస్తోంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక, నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది.. మహిళా భద్రత ఉండాలంటే వారిని గౌరవించాలి.. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు భారం తగ్గుతుంది.. నెలకు కనీసం రూ. 1500 భారం తగ్గుతుందన్నారు. ధన దాహం కోసం గత ఐదేళ్ళు విషంతో సమానమైన మద్యం ఇచ్చి మహిళల తాళిబొట్లు తెంపారు.. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు.. ముందు ఇంట్లోని తల్లి చెల్లికి న్యాయం చేసి మా గురించి ఆలోచించాలని హెచ్చరిస్తున్నాను.. పరిశ్రమలు గత ఐదేళ్ళలో పక్క రాష్ట్రాలకు తరలించారు మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
Read Also: Massive Cloudburst: స్వాతంత్ర్య దినోత్సవం వేళ మృత్యుఘోష.. 65కు చేరిన మృతుల సంఖ్య..
ఇక, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్లతో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అని మంత్రి లోకేష్ తెలిపారు. మిస్సైల్ మోడీ ఆపరేషన్ సింధూర్ తో తగిన గుణపాఠం చెప్పారు.. మురళీ నాయక్ ను కోల్పోయాం.. మురళీ నాయక్ తన కుంటుంబానికి భారతదేశం అండగా ఉంటుందన్నారు. అయితే, సినిమాలు, వెబ్ సిరీస్ లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఉంటే తీసి వేయ్యాలి అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!