లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి…
కట్టుకున్న భార్యపై అనుమానంతో కడతేర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా మరోసారి ఆ విషయంపై వాగ్వాదం నెలకొనగా.. ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు.
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. కలకాలం తోడుగా.. అండగా ఉండాల్సిన అర్ధాంగి పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని,…
యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మేడ్చల్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను గొలుసులతో బంధించి భార్య చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ (50), భారతి (45) అంబేద్కర్ నగర్ నివాసితులు. రెండు అపార్ట్మెంట్ల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. కృష్ణ తన భార్య నుండి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భారతి భార్య మూడు రోజుల…