Suicide: భార్యభర్తల మధ్య గొడవలు.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య
- ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య
- తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్
- ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో ఘటన
- మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని హమీర్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
Ayurvedic Drink: ఈ ఆయుర్వేద పానీయంతో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులకు చెక్..
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
వివరాల్లోకి వెళ్తే.. మోహిని అనే వివాహిత దాదాపు 10 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్లింది. వారిద్దరు పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. అయితే.. మూడేళ్ల క్రితం వీరి మధ్య గొడవలు దూరాయి. ఈ క్రమంలో భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో.. ఆ మహిళ తన కన్నవారింటికి వచ్చి ఉంటుంది. కూలి పని చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. అయితే.. ఆమె శనివారం నోయిడా వెళుతున్నానని చెప్పి తన ఇద్దరు కుమారులు 5 ఏళ్ల గౌతమ్, 3 ఏళ్ల హర్ష్తో కలిసి ముస్కరా పట్టణానికి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎవరు లేని ప్రాంతానికి చేరుకున్న వివాహిత మోహిని.. అక్కడ పిల్లలిద్దరికీ విషం ఇచ్చి తానూ తాగింది. అయితే.. కొద్దిసేపటికే ముగ్గురి పరిస్థితి విషమించింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చేలోపే మోహిని, గౌతమ్ చనిపోయారు. చిన్న కుమారుడు హర్ష్ను సిహెచ్సికి తరలించారు. అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయగా.. తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పిల్లవాడు కూడా మరణించాడు.
Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
చనిపోయే ముందు మృతురాలు నోయిడాలో నివసిస్తున్న తన స్నేహితురాలికి ఫోన్ చేసిం మాట్లాడింది. పిల్లలిద్దరితో పాటు తాను కూడా విషం సేవించినట్లు తన తల్లికి చెప్పాలని కోరింది. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు ముస్కారాకు చేరుకున్నారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. దీంతో.. కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరుమున్నీయ్యారు. మోహిని తల్లి రాజకుమారి మాట్లాడుతూ.. మోహిని 10 సంవత్సరాల క్రితం తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పింది. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఇద్దరూ విడివిడిగా జీవించేవారని తెలిపింది. ఈ క్రమంలో.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తల్లి తెలిపింది.
- Tags
- children
- Crime News
- husband
- suicide
- wife
తాజావార్తలు
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
-
Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!