Suicide: భార్యభర్తల మధ్య గొడవలు.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య
- ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య
- తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్
- ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో ఘటన
- మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య
యూపీలోని హమీర్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
Ayurvedic Drink: ఈ ఆయుర్వేద పానీయంతో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులకు చెక్..
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
వివరాల్లోకి వెళ్తే.. మోహిని అనే వివాహిత దాదాపు 10 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తన ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్లింది. వారిద్దరు పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. అయితే.. మూడేళ్ల క్రితం వీరి మధ్య గొడవలు దూరాయి. ఈ క్రమంలో భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో.. ఆ మహిళ తన కన్నవారింటికి వచ్చి ఉంటుంది. కూలి పని చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. అయితే.. ఆమె శనివారం నోయిడా వెళుతున్నానని చెప్పి తన ఇద్దరు కుమారులు 5 ఏళ్ల గౌతమ్, 3 ఏళ్ల హర్ష్తో కలిసి ముస్కరా పట్టణానికి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎవరు లేని ప్రాంతానికి చేరుకున్న వివాహిత మోహిని.. అక్కడ పిల్లలిద్దరికీ విషం ఇచ్చి తానూ తాగింది. అయితే.. కొద్దిసేపటికే ముగ్గురి పరిస్థితి విషమించింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చేలోపే మోహిని, గౌతమ్ చనిపోయారు. చిన్న కుమారుడు హర్ష్ను సిహెచ్సికి తరలించారు. అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయగా.. తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పిల్లవాడు కూడా మరణించాడు.
Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
చనిపోయే ముందు మృతురాలు నోయిడాలో నివసిస్తున్న తన స్నేహితురాలికి ఫోన్ చేసిం మాట్లాడింది. పిల్లలిద్దరితో పాటు తాను కూడా విషం సేవించినట్లు తన తల్లికి చెప్పాలని కోరింది. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు ముస్కారాకు చేరుకున్నారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. దీంతో.. కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరుమున్నీయ్యారు. మోహిని తల్లి రాజకుమారి మాట్లాడుతూ.. మోహిని 10 సంవత్సరాల క్రితం తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పింది. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఇద్దరూ విడివిడిగా జీవించేవారని తెలిపింది. ఈ క్రమంలో.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని తల్లి తెలిపింది.
- Tags
- children
- Crime News
- husband
- suicide
- wife
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో