Crime News: దారుణం.. కవల ఆడపిల్లలు పుట్టారని చంపేసిన తండ్రి
- ఢిల్లీలో దారుణ ఘటన
- ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని చంపేసిన తండ్రి
- అనంతరం శిశువుల మృతదేహాల పూడ్చివేత
- శిశువుల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు
- శిశువుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం నవజాత శిశువుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
Read Also: IND vs AUS: భారత్, ఆసీస్ మ్యాచ్కు వర్షం ఎఫెక్ట్.. రద్దయితే ఆ జట్టుకు పండగే..!
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
దీంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పూజా సోలంకి అనే మహిళ ఇటీవల ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. జూన్ 1న.. పూజ తన బిడ్డలతో సహా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. ఆమె రోహ్తక్లోని తన తల్లి ఇంటికి వెళ్లాలనుకుంది. కానీ ఆమె భర్త నీరజ్ సోలంకి తన కారులో శిశువులను ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మరొక కారులో తల్లిని ఫాలో కావాలని చెప్పాడు. అయితే మధ్యలో నీరజ్ రూటు మార్చాడు. అయితే.. పూజ సోదరుడు నీరజ్కు ఫోన్ చేస్తే.. కాల్ కనెక్ట్ కాలేదు. అనంతరం.. శిశువులను నిందితుడు హత్య చేసి పాతిపెట్టాడు. ఈ ఘటనకు పాల్పడింది నీరజ్ కుటుంబీకులేనని పూజా సోదరుడు గుర్తించారు. కాగా.. పూజ 2022లో నీరజ్ని వివాహం చేసుకుంది. ఎఫ్ఐఆర్ లో.. పూజ అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించేవారని తెలిపింది.
తాజావార్తలు
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..