Crime News: భార్యపై కోపంతో కుమారుడిని పొట్టన పెట్టుకున్న తండ్రి.. నోట్లో కాగితాలు కుక్కి హత్య
- మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన
- నోట్లో కాగితాలు కుక్కి కొడుకును చంపిన తండ్రి
- భార్య భర్తల మధ్య గొడవలతో కొద్ది రోజులుగా దూరం
- భార్యపై కోపంతో కుమారుడిని పొట్టన పెట్టుకున్న తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియరాలేదు.
Deputy C M: దేశంలో మొదటి డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కిందో తెలుసా?
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. భార్య భర్తల మధ్య గొడవలు జరిగి వారు దూరంగా నివసిస్తున్నారని చెప్పారు. అయితే తన.. 9 ఏళ్ల కుమారుడు తల్లితోనే ఉంటున్నాడు. ఉన్నట్టుండి సోమవారం రోజున తల్లి ఇంటి నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత.. అతను కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తండ్రి ఇంటి సమీపంలో బాలుడు శవమై కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..
బాలుడి నోటిలో పేపర్ నింపి మరీ హత్య చేసినట్లు గుర్తించారు. అయితే.. భార్యతో విడిపోయిన తర్వాత నిందితుడు అతిగా మద్యం సేవించడం ప్రారంభించాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు సోమవారం అర్థరాత్రి రాత్రి మద్యం సేవించి, చిరిగిన నోట్బుక్ కాగితాలతో చేసిన బంతిని తన కొడుకు నోటిలో నింపాడని, దాంతో బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్టు చేసి అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు మరణంతో తల్లి తీవ్రంగా రోధిస్తుంది.
- Tags
- Crime News
- father
- Killed
- mouth
- Papers
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..