ఒకప్పుడు కరోనా వైరస్.. తర్వాత డెల్టా… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్. చిన్నవైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత తక్కువగానే ఉంది.…
ఇప్పుడు ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి పెద్ద సవాల్గా మారుతోంది.. ఓవైపు క్రమంగా డెల్టా, డెల్టా ప్లస్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇదే సమయంలో ఒమిక్రాన్ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ కలవరానికి గురిచేస్తోంది.. ఒమిక్రాన్పై మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). Read Also: కీచక రాఘవ…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దాని ప్రభావం ఉంటుంది.. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో).. ఒమిక్రాన్పై కీలక వ్యాఖ్యలు చేసింది.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉంటుందని పేర్కొన్న డబ్ల్యూహెచ్వో.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువని.. ఒమిక్రాన్ మరణాలు కూడా తక్కువేనని పేర్కొంది.. ఇక, ఇప్పటికే ఒమిక్రాన్ వేరయంట్ 128 దేశాలకు వ్యాపించిందని చెబుతోంది..…
2020 లో కరోనా మహమ్మారి ప్రపంచంలో వ్యాపించడం మొదలుపెట్టింది. చైనాలో 2019 డిసెంబర్లో బయటపడ్డ కరోనా, ఆ తరువాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. చైనా నుంచి ఇటలీ, యూరప్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించింది. 2021 వరకు ప్రపంచం వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావడంతో కరోనా పూర్తిగా సమసిపోతుందని అనుకున్నారు. కానీ, రూటు మార్చి, రూపం మార్చుకొని డెల్టా రూపంలో, ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతున్నది.…
దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్వో. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ కంటే ముందు వచ్చిన డెల్టా వేరియంట్తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ సోకిన దేశాల్ల విజృంభిస్తోంది. ఇటీవల భారత్లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై డబ్ల్యూహెచ్వో స్పందించింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్…
ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్తో సతమతమవుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తాజాగా ఒమిక్రాన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పలు విషయాలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ బారినపడి కోలుకున్న వ్యక్తులైన వారికి సైతం ఈ ఒమిక్రాన్…
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరింయట్పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సారి కనుక ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగి ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేశ ప్రభుత్వాలదేనని తెలిపింది. కరోనా కొత్త వేరింయట్ ఒమిక్రాన్ ఇప్పటి వరకు 89 దేశాలకు వ్యాపించినట్లు who తెలిపింది. ఈ వేరియంట్ సోకిన ప్రాంతాల్లో కేసులు, రెండు మూడు రోజుల్లోనే రెట్టింపు…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటున్న వేళ పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని అంతా కోరుకుంటున్నారు. WHO కోవా వ్యాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో చిన్నారుల్ని ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు అవకాశం ఏర్పడింది. పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కోవోవాక్స్ ట్రయల్ జరుగుతున్నాయి. టీకా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా నుంచి కాపాడుతుందని వైద్యరంగ నిపుణులు…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జట్ స్పీడ్తో ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. అయితే, ఒమిక్రాన్ వేగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది… మరింత అప్రమత్తత అవసరమని వార్నింగ్ ఇస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే 77 దేశాల్లో నమోదు అయినట్టు తెలిపారు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్.. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్ను గుర్తించే పనిలో పడిపోయారని వెల్లడించారు.. ఇదే…