ఒమిక్రాన్ అలజడి.. దేశంలో 961కి చేరిన కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్వో.
గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 263 కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 252 కేసులు నమోదయ్యాయి. ముంబైలో నిన్న కొత్తగా 33 కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాపితంగా కొత్తగా 85 కేసులు నమోదయ్యాయి.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
గుజరాత్ లో నిన్న మరో 19 కేసులు నమోదు కావడంతో 97 కు చేరిన “ఒమిక్రాన్” కేసులు. రాజస్థాన్ లో 69, కేరళ లో 65, తెలంగాణ లో 62 “ఒమిక్రాన్” కేసులు నమోదు. ఢిల్లీలో నిన్న కొత్తగా 923 కోవిడ్ కేసులు నమోదు. దేశంలో కొత్తగా మొన్న 9,195 కోవిడ్ కేసులు నమోదు. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 13,154కి చేరాయి. ప్రతి దేశంలో 40 శాతం జనాభా ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ తీసుకోవాలని, 2022 మధ్య కల్లా 70 శాతం జనాభా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ప్రపంచ ఆరోగ్య సంస్థలో మొత్తం 194 దేశాలకు సభ్యత్వం ఉంది. 92 దేశాలు 40 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చే లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని చెప్పారు డబ్ల్యు.హెచ్.ఓ అధ్యక్షుడు డా. టెడ్రాస్. 2020 లో 18 లక్షల మంది కోవిడ్-19 వల్ల చనిపోగా, 2021 లో 35 లక్షల మంది మృతి చెందారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ, వాస్తవంలో ఆ మరణాల సంఖ్య ఇంకా పెద్దగా ఉండవచ్చని విమర్శలు వస్తున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు తక్కువ పరిమాణంలో వ్యాక్సిన్ సరఫరా కావడం, సరఫరా అయున వ్యాక్సిన్ కూడా దాదాపు గడువు ముగిసిపోతున్న వ్యాక్సిన్ కావడం, కీలకమైన సిరంజి లు లేకపోవడం లాంటి కారణాల వల్ల ఆయా దేశాలు లక్ష్యం మేరకు ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయాయని చెబుతోంది డబ్ల్యుహెచ్వో.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!