అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి వైట్హౌస్ వేదికగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఫిబ్రవరిలో సమావేశం అయినప్పుడు ఇద్దరి మధ్య హాట్హాట్గా సమావేశం సాగింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఆర్మేనియా-అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అర్మేనియన్ ప్రధాన మంత్రి నికోల్ పషిన్యన్, అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్తో కరచాలనం చేసుకున్నారు.
Donlad Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందం గురించి ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ట్రంప్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. లెవిట్ ముఖం, పెదవులపై ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ఆమె ఒక స్టార్ అయింది’’ అని ఇటీవల ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఆమె ముఖం, మెదడు, పెదవులు అవి కదిలే విధానం, అవి ఆమె మెషిన్ గన్లా కదులుతాయి’’ అని…
వైట్ హౌస్ లో జరిగిన పిక్నిక్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపుకు సంబంధించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లుపై సంతకం చేశారు. దీనితో, ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒక రోజు ముందుగా 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం…
“వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”పై ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. EVలకు ఫెడరల్ కన్స్యూమర్ టాక్స్ క్రెడిట్ను దశలవారీగా తొలగించాలనే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రణాళిక నుంచి మస్క్ వ్యతిరేకత వచ్చిందని, ఇది టెస్లాను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలోన్, నేను చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. Also Read:TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు.
వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్హౌస్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ట్రంప్ విందు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓట్లు వేసినందుకు ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.