What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- మైదుకూరులో సీఎం పర్యటన
- తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల
- భారత జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ మండపం చేరుకొని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
నేడు గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెదకాకాని మండలం నంబూరులో స్వచ్ఛ ఏపీ-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు రాయచోటలో పర్యటించనున్నారు.
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేశారు. ఘాట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సమాధికి నిండుగా పూలతో అలంకరించారు.
నేడు శ్రీశైలంలో స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరగనుంది. మన ఊరు-మన గుడి-మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈరోజు ఖమ్మం జిల్లాల్లో ఎంపీ రేణుకా చౌదరి పర్యటించనున్నారు.
నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
నేడు ఏసీబీ ముందుగ్రీన్ కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు హాజరుకానుఅంరు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరుకావాలంటూ రెండు కంపెనీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
ఈరోజు తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ విడుదల కానుంది.
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టును నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!