What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- దావోస్లో సీఎం చంద్రబాబు పర్యటన
- కాళేశ్వరం కమిషన్ రెండోరోజు విచారణ
- భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్
- అనంతపురంలో 'డాకూ మహారాజ్' విజయోత్సవ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ మూడోరోజు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్కు వెళ్లారు.
సౌత్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన జవాన్ కార్తీక్ పార్దీవదేహం నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎగువ రాగిమానుపెంటకు చేరుకోనుంది.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
నేడు రాజమండ్రిలో జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ జరగనుంది. జై బాపూజీ, జై భీం, జై సంవిధాన్ వివాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ జరగనుంది.
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేడు హైదరాబాదులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రెండవ రోజు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను బాలయ్య బాబు ప్రారంభించనున్నారు.
నేడు మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లిలో పర్యటించనున్నారు. కలెక్టరేట్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
నేడు కాళేశ్వరం కమిషన్ రెండోరోజు విచారణ జరగనుంది. నేటి నుంచి కమిషన్ ముందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. వరసగా మూడు రోజులు పాటు ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది.
తెలంగాణ రాష్ట్రంలో రెండోరోజు గ్రామసభలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి.
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని రేణికుంట, వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలో , ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని జైన గ్రామాల్లో మంత్రుల పర్యటించనున్నారు.
వరంగల్ జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈరోజు అనంతపురంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్’ విజయోత్సవ సభ జరగనుంది.
ఈరోజు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయిదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతాలో తొలి పోరు జరగనుంది.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!