What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- విజయవాడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
- నేటి నుంచి కొమురవెళ్లి జాతర ఆరంభం
- సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.
నేడు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి జ్యురిచ్ బయలుదేరనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొననున్నారు.
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
రాజమండ్రి సత్యసాయి గురుకులంలో సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రవచనం చేయనున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత వసంతాల వేడుకల్లో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ ప్రవచనం చేయనున్నారు.
నేటితో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. పది రోజుల వ్యవధిలో 6 లక్షల 80 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
నేడు విశాఖ GVMC గాంధీ విగ్రహం దగ్గర కమ్యూనిస్టు పార్టీల నిరసన కార్యక్రమం జరగనుంది. స్టీల్ ప్లాంటుకు సొంతగనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, స్టీల్ ప్లాంట్ను అమ్మే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి, గాలివీడు మండలాలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు.
నేటి నుంచి సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి జాతర ఆరంభం కానుంది. రెండు నెలల పాటు మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరగనున్నాయి.
నేడు ఖమ్మం జిల్లాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి శంఖుస్థాపన చేయనున్నారు.
సింగపూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. నిన్నటి పర్యటనలో తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది.
5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆడేందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లు శనివారం కోల్కతాకు చేరుకున్నాయి. నేటి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టనున్నాయి.
ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ సహా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో భాగంగా నేడు కీలక మ్యాచులు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!