central government warning to apple watch users: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్నారు. హెల్త్ మానిటరింగ్కు సంబంధించి ఆపిల్ వాచ్ ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే ఎంతో మంది నెటిజన్లు తమ ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిందంటూ సోషల్ మీడియాలో పలు మార్లు కథనాలను పోస్ట్ చేయడం మనం చూసే ఉంటాం. అందుకే ఆపిల్ వాచీని వాడేందుకు యూజర్లు ఎంతో ఇష్టపడుతున్నారు. అయితే తాజాగా ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర…
సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో చూసేందుకు అందంగా కనిపించే కోనో కార్పస్ అనే మొక్కను కూడా గతంలో చాలా మంది రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లో ఏపుగా పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కలు నాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై, నర్సరీలలో, ఇళ్లల్లో ఎక్కడా ఈ మొక్కలను పెంచవద్దని నిషేధం విధించారు. ఈ మొక్కల కారణంగా…
భూఆక్రమణలు,వసూళ్ళకు పాల్పడితే, టిఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులను పార్టీనుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనపై వాఖ్యలు చేశారు. మున్సిపాలిటీకి చెందిన పది శా తం, మరికొన్ని స్థలాలు, గాంధీ ట్రస్టు భూమి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ ట్రస్టు సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పాటైందని,…
ఆశ వర్కర్లకు పనిలో సిన్సియారీటి ఉండాలి..లేకుంటే ఏరిపారేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మించిన మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మెదక్ లో మాత శిశు ఆరోగ్య కేంద్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్…
ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ఈ సాయంత్రం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాలలో రైతులు వెంటనే పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన…
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని…
వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో…
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్డే రోజు ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు భోపాల్లో శివసేన కార్యకర్తలు కర్రలు చేతబూని వాటికి కాళికా దేవి మందిరంలో పూజలు కూడా నిర్వహించారు.…
ఇంటర్ విద్యార్ధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 2 లక్షల 36 వేల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని, లక్ష పైబడి విద్యార్దులు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే అందులో వున్నారన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఆత్మహత్య లు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విద్యార్థులు ఆత్మహత్యలు వద్దని చెప్పే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.…
యూనివర్శిటీలో వుండే అనధికారిక విద్యార్ధినీ, విద్యార్ధులకు అల్టిమేటం ఇచ్చింది ఉస్మానియా వర్శిటీ. డిసెంబర్ 27న, అన్ని సెమిస్టర్ల ప్రారంభ తేదీ దగ్గర పడుతోంది, హాస్టళ్లలో ఉంటున్న అనధికార వ్యక్తులందరూ 24 డిసెంబర్ 2021 (శుక్రవారం) మధ్యాహ్నం 12.00 గంటలలోపు గదులను ఖాళీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. హాస్టళ్లలో అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యాలను నియంత్రించడానికి అనధికార వ్యక్తులను హాస్టళ్ల నుండి ఖాళీ చేయాలని బోనఫైడ్ విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ చేయని వారిని…