Bank Robbery: తుపాకీతో బెదిరించి.. బ్యాంకు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి.
Also Read
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ముగ్గురు సిబ్బంది పనిచేసే బ్రాంచ్ లో మిగిలిన సిబ్బంది భోజనానికి వెళ్లగా…క్యాషియర్ ప్రతాప్ రెడ్డి ఒక్కరే వున్నారు. సరిగ్గా 2.07 నిముషాల సమయం…హెల్మెట్, బ్యాగ్,జర్కిన్ ధరించిన ఓ యు వకుడు బైక్ పై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంక్ లోకి ప్రవేశించి నేరుగా క్యాష్ ఇయర్ దగ్గరకు వెళ్ళాడు.ప్రతాప్ రెడ్డికి తుపాకీ ఎక్కుపెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించాడు ఆగంతకుడు. ఈ అనూహ్యమైన ఘటనతో షాక్ గురైన క్యాష్ ఇయర్ తేరుకునే లోపే కౌంటర్లోని 3ల క్షల 30వేలుతో పరారయ్యాడు.
రెండు నిముషాలు వ్యవధిలోనే చోరీ జరగగా ఈ ఘటన చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయి. రాబరీ చేసింది ఉత్తరాది ముఠా గా భాషను బట్టి అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు విస్త్రతంగా గాలింపు చేపట్టాయి ప్రత్యేక బృందాలు. అనకాపల్లి జిల్లా పోలీసులకు దోపిడీ ముఠా సవాల్ విసిరింది.ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను పట్టపగలు దోచేసింది. రెండంటే రెండు నిముషాల్లో అత్యంత చాకచక్యంగా పని కానిచ్చేసి పరారైపోగా… ఈ చోరీ వెనుక ఉన్నది ఒకరు, ముఠాన అనేది అంతుబట్టడం లేదు.
సీసీ ఫుటేజ్ పరిశీలించి నప్పుడు రాబారీకి వచ్చిన వ్యక్తి , బయట మరొకరు తిరిగుతున్నట్టు కనిపించింది. దీంతో వీరిద్దరూ ఒక్కరేనా వేరు వేరా అనేది తేలాలి. రాబరీ తర్వాత నిందితుడు పరారవ్వగా అదే సమయంలో దాదాపుగా ఒకే మోడల్ బైక్ లు అక్కడి నుంచి వెళ్లడం కనిపించింది. బ్యాంక్ లో దోపిడీ చేయడం అంటే ఒక పథకం ప్రకారం చేసి ఉంటారనేది పోలీసులు అనుమానం. ఎప్పుడు ఖాతాదారులు ఉండరు..?.సిబ్బంది భోజనాలకు ఎప్పుడు వెళతారు వంటివన్నీ పక్కాగా రెక్కీ వేసుకునే వచ్చినట్టు కనిపిస్తుంది. క్లూస్ టీమ్ కీలకమైన ఆధారాలు సేకరించగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దోపిడీ తర్వాత నిందితులు ఎటు వెళ్లారనేది సస్పెన్స్ గా మారింది. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంక్లను టార్గెట్ చేసిన ముఠా పనే అయి వుంటుందనే అనుమానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!