Bank Robbery: తుపాకీతో బెదిరించి.. బ్యాంకు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి.
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ముగ్గురు సిబ్బంది పనిచేసే బ్రాంచ్ లో మిగిలిన సిబ్బంది భోజనానికి వెళ్లగా…క్యాషియర్ ప్రతాప్ రెడ్డి ఒక్కరే వున్నారు. సరిగ్గా 2.07 నిముషాల సమయం…హెల్మెట్, బ్యాగ్,జర్కిన్ ధరించిన ఓ యు వకుడు బైక్ పై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంక్ లోకి ప్రవేశించి నేరుగా క్యాష్ ఇయర్ దగ్గరకు వెళ్ళాడు.ప్రతాప్ రెడ్డికి తుపాకీ ఎక్కుపెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించాడు ఆగంతకుడు. ఈ అనూహ్యమైన ఘటనతో షాక్ గురైన క్యాష్ ఇయర్ తేరుకునే లోపే కౌంటర్లోని 3ల క్షల 30వేలుతో పరారయ్యాడు.
రెండు నిముషాలు వ్యవధిలోనే చోరీ జరగగా ఈ ఘటన చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయి. రాబరీ చేసింది ఉత్తరాది ముఠా గా భాషను బట్టి అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు విస్త్రతంగా గాలింపు చేపట్టాయి ప్రత్యేక బృందాలు. అనకాపల్లి జిల్లా పోలీసులకు దోపిడీ ముఠా సవాల్ విసిరింది.ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను పట్టపగలు దోచేసింది. రెండంటే రెండు నిముషాల్లో అత్యంత చాకచక్యంగా పని కానిచ్చేసి పరారైపోగా… ఈ చోరీ వెనుక ఉన్నది ఒకరు, ముఠాన అనేది అంతుబట్టడం లేదు.
సీసీ ఫుటేజ్ పరిశీలించి నప్పుడు రాబారీకి వచ్చిన వ్యక్తి , బయట మరొకరు తిరిగుతున్నట్టు కనిపించింది. దీంతో వీరిద్దరూ ఒక్కరేనా వేరు వేరా అనేది తేలాలి. రాబరీ తర్వాత నిందితుడు పరారవ్వగా అదే సమయంలో దాదాపుగా ఒకే మోడల్ బైక్ లు అక్కడి నుంచి వెళ్లడం కనిపించింది. బ్యాంక్ లో దోపిడీ చేయడం అంటే ఒక పథకం ప్రకారం చేసి ఉంటారనేది పోలీసులు అనుమానం. ఎప్పుడు ఖాతాదారులు ఉండరు..?.సిబ్బంది భోజనాలకు ఎప్పుడు వెళతారు వంటివన్నీ పక్కాగా రెక్కీ వేసుకునే వచ్చినట్టు కనిపిస్తుంది. క్లూస్ టీమ్ కీలకమైన ఆధారాలు సేకరించగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దోపిడీ తర్వాత నిందితులు ఎటు వెళ్లారనేది సస్పెన్స్ గా మారింది. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంక్లను టార్గెట్ చేసిన ముఠా పనే అయి వుంటుందనే అనుమానాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!