Harish Rao: ఆశావర్కర్లకు మంత్రి హరీశ్ రావ్ స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆశ వర్కర్లకు పనిలో సిన్సియారీటి ఉండాలి..లేకుంటే ఏరిపారేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మించిన మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దళిత బంధు లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో మెదక్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మెదక్ లో మాత శిశు ఆరోగ్య కేంద్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ కు సంబందించిన ఉత్తర్వులు అందజేస్తామని వరాలజల్లు కురిపించారు. వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మెదక్ లో 100 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాం..దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని రకాల హంగులతో హాస్పిటల్ ను ఏర్పాటు చేశామని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ప్రభుత్వ హాస్పిటల్స్ లో కాన్పుల సంఖ్య పెరగాలని, అధికారుల నిర్లక్ష్యంతో కాన్పుల డాటా చెప్పలేక పోతున్నామని హరీశ్ రావ్ అన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ హాస్పిటల్స్ లో 30 శాతం ఉంటే.. ఇప్పుడు 56 శాతానికి పెరిగింది.. దీనిని మరింతగా పెంచుతామని పేర్కొన్నారు. ఆశావర్కర్లు గర్భిణిలను ప్రభుత్వ హాస్పిటల్స్ కు తీసుకురావాలని కోరారు. నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలని ఆదేశించారు. పేదలు ప్రయివేటు హాస్పిటల్స్ కి వెళ్లి అప్పులపాలు కావద్దని సూచించారు.
తెలంగాణ లో 36 శాతం మాత్రమే మొదటి గంట తల్లి పాలు తాగుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అంగన్ వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ కింద పౌష్టికాహారం ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు ఆశ వర్కర్లకు 15 వందల జీతం ఉంటే.. ఇప్పుడు రూ 9500 జీతం ఇస్తున్నారు..ఇంకా పెంచుకుందామని శుభవార్త చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షకులు ఆశావర్కర్లు అంటూ ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ లో నార్మల్ డెలివరీ లు చేస్తే పారితోషకం ఇస్తామని హరీశ్ రావ్ అన్నారు. ఆశ వర్కర్లకు పనిలో సిన్సియారీటి ఉండాలి..లేకుంటే ఏరిపారేస్తామని అన్నారు. కరోనా సందర్భంగా వైద్యులు,సిబ్బంది, ఆశావర్కర్లు ఎంతో కష్ట పడ్డారని గుర్తు చేసుకున్నారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ సౌకర్యం ప్రభుత్వ హాస్పిటల్స్ లో జరగాలి..ప్రయివేట్ హాస్పిటల్స్ కు పంపొద్దని, ప్రభుత్వ ఆరోగ్య సేవలను బలోపేతం కోసం సమిష్టిగా పనిచేద్దామని అన్నారు.
అమ్మఒడి వాహనాలను వాడాలి.. మనమందరం ప్రజల సేవకులమని హరీశ్ రావ్ తెలిపారు. దళిత బంధు అనేది పథకం కాదు..ఒక ఉద్యమం అన్నారు. దళిత సంరక్షణ నిధిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 16 శాతం దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో 256 మందికి గ్రౌండింగ్ చేస్తున్నామని ఈ సందర్భంగా హరీశ్ రావ్ అన్నారు.
Talasani Srinivas Yadav: అమ్మవారిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయటం దుర్మార్గం
తాజావార్తలు
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!