ఇంటర్ విద్యార్ధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 2 లక్షల 36 వేల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని, లక్ష పైబడి విద్యార్దులు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే అందులో వున్నారన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఆత్మహత్య లు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విద్యార్థులు ఆత్మహత్యలు వద్దని చెప్పే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.
ఇంటర్ విద్యార్ధులకు సంఘీభావంగా మేము మూడు గంటలు దీక్ష చేశాం. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. సీఎం కేసీఆర్ని అప్పాయింట్ మెంట్ కోరాం. ఆయన్ని కలిసి సమస్య చెబుదామని అడిగాం.. కానీ రిప్లై లేదు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందకండి అని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన రాకుంటే.. ..మంగళవారం ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపు నిస్తామన్నారు. 10 వేల మంది విద్యార్థులతో ముట్టడి కార్యక్రమం వుంటుందని హెచ్చరించారు జగ్గారెడ్డి.