Kejriwal Vs LG: అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం.. సీఎంకు లేఖ
- అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం
- కేజ్రీవాల్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఎల్జీ
- అతిషికి లేఖ రాసిన లెఫ్టినెంట్ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. త్వరలో హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ ఆప్ ఎన్నికలకు రెడీ అయిపోయింది. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తోంది. ఇక ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,100 సాయం, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం ప్రకటించారు. తాజాగా సోమవారం అర్చకులకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం ప్రకటించారు. అయితే సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అతిషి కేవలం తాత్కాలిక ముఖ్యమంత్రి అని.. ఎన్నికల్లో గెలిచాక తిరిగి ముఖ్యమంత్రి తానేనని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అతిషిని తాత్కాలిక సీఎం అని అనడం అవమానకరం అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. ఈ మేరకు అతిషికి రాసిన లేఖలో ఎల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్య రాజ్యాంగ విలువలకు, పదవి గౌరవానికి భంగం కలిగించేలా ఉందని లేఖలో విమర్శించారు. “ఈ వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా భావించాను. బాధపడ్డాను. ఇది మీకు మాత్రమే కాదు. భారత రాష్ట్రపతికి, ఆమె నియమించిన ఆమె ప్రతినిధిగా నాకు కూడా అవమానం. లెఫ్టినెంట్ గవర్నర్గా నేను ఆందోళన చెందుతున్నాను.”అని లేఖలో వీకే. సక్సేనా పేర్కొన్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలుకు వెళ్లారు. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్లో బెయిల్పై బయటకు వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి ఆ స్థానంలో అతిషిని కూర్చోబెట్టారు. తిరిగి ఎన్నికల్లో గెలిచేదాకా ఆ పదవిలో కూర్చోనని శపథం చేశారు. అయితే తాజాగా అతిషిని తాత్కాలిక సీఎం అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలను ఎల్జీ తప్పుపట్టారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రచారం చేపట్టింది. తిరిగి అధికారం ఛేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అలాగే బీజేపీ, కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగాయి. ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!