Medha Patkar: మేధా పాట్కర్కు భారీ ఊరట.. జైలు శిక్ష సస్పెండ్
- మేధా పాట్కర్కు భారీ ఊరట
- జైలు శిక్ష సస్పెండ్.. బెయిల్ మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. దీంతో నర్మదా బచావో ఉద్యమకారిణికి బిగ్ రిలీఫ్ వచ్చినట్లైంది.
నర్మదా బచావో ఉద్యమ నేత మేధా పాట్కర్కు విధించిన ఐదు నెలల సాధారణ జైలు శిక్షను ఢిల్లీ కోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. 23 ఏళ్ల క్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గుజరాత్లోని ఎన్జీవోకు నేతృత్వం వహించిన పరువు నష్టం కేసులో మేధా పాట్కర్కు జూలైలో శిక్ష పడింది. దీంతో ఆమె శిక్ష రద్దు చేయాలని ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తాజాగా కోర్టు.. శిక్షను సస్పెండ్ చేస్తూ.. 25,000 పూచీకత్తుపై పాట్కర్కు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సెప్టెంబర్ 4న సమాధానం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ఎల్జీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
జూలై 1న ఢిల్లీ కోర్టు మేధా పాట్కర్కు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. సక్సేనాకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును వెల్లడిస్తూ.. పాట్కర్ వయస్సు, అనారోగ్యం పరిగణనలోకి తీసుకుంటే ఇది కఠినమైన శిక్ష కాదు అని కోర్టు పేర్కొంది.
పరువు నష్టం కేసు జనవరి 2001 నాటిది. నవంబర్ 25, 2000న ‘ట్రూ ఫేస్ ఆఫ్ పేట్రియాట్’ పేరుతో పాట్కర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో అహ్మదాబాద్కు చెందిన ఎన్జీవోకి నాయకత్వం వహించిన వీకే. సక్సేనాను ‘పిరికివాడు’ అంటూ సంభోదించారు. అలాగే హవాలా లావాదేవీల్లో సక్సేనా ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆ సమయంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా భారీ నిరసనలకు నాయకత్వం వహించారు. దీని తర్వాత ఒక టీవీ ఛానెల్లో తన గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటనను జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్పై సక్సేనా రెండు కేసులు పెట్టారు. పరువుకు నష్టం కలిగించేలా పాట్కర్ వ్యవహరించారని ఆరోపించారు. మే 2024లో న్యాయస్థానం ఈ కేసులో పాట్కర్ను దోషిగా నిర్ధారించింది. ఆమె చర్యలు ఉద్దేశపూర్వకంగా.. దురుద్దేశపూర్వకంగా.. సక్సేనా ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవి ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?