టీమిండియా క్రికెట్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్. భారత స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈమేరకు కాసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. గత వారమే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు. దాంతో రోహిత్, కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. రోహిత్, కోహ్లీలు ఒకేసారి టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.…
ఇప్పటికే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది.…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు…
Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…
భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు వీడ్కోలు పలికారు. తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేకి మాత్రమే పరిమితమయ్యాడు. సరే.. కోహ్లీ ఉన్నాడులే అనుకునేలోపే అభిమానులకు హార్ట్ బ్రేక్ అయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కి ముందే తన టెస్ట్ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేయనున్నాడు.…
Virat Kohli : పాకిస్థాన్-భారత్ సాగిస్తున్న యుద్ధ వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించారు. ‘ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి బిగ్ సెల్యూట్. వారు, వారి కుటుంబ త్యాగాలను వెలకట్టలేం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ తో పాటు ఇతర క్రీడాకారులు…
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు నిలకడగా ఆడిన ఆటగాడు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పవచ్చు. 2008లో తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టుకు ఆడుతున్న కోహ్లీ తాజాగా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆర్సీబీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయినా ఓ వీడియోలో పోడ్కాస్ట్ షో లో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఒక దశలో తాను జట్టు మారాలని ఆలోచించానని తెలిపాడు. కోహ్లీ తన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్లో) చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి కోహ్లీ 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్పై హాఫ్ సెంచరీ చేయడంతో విరాట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. అత్యధిక సీజన్లలో…
భారత జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఓ హాట్ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టడమే. నటి అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ను ఆయన లైక్ చేసి, వెంటనే దానిని తొలగించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 23 ఏళ్ల…