Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
- బెంగళూరులోని One8 Commune బార్ అండ్ రెస్టారెంట్ పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు.
- టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ స్థలానికి సహ యజమానిగా ఉన్నారు.
- బార్ ప్రాంగణంలో స్పెషల్ స్మోకింగ్ జోన్ లేకపోవడం నిబంధనల ఉల్లంఘనగా గుర్తింపు.
- కేసు బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు. ఈ కేసును స్థానిక న్యాయస్థాన అనుమతి అనంతరం పోలీసులు నమోదు చేశారు.
Read Also: Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మే 29 నుంచి బెంగళూరు పోలీసులు ధూమపాన నియమాల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా One8 Commune ప్రాంగణంలో ధూమపానం కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం లేకపోవడం పోలీసులు గుర్తించారు. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా ఉందని పోలీసుల అధికారులు పేర్కొన్నారు. FIRను బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు చేశారు. వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు అభిప్రాయపడ్డారు.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
నిజానికి One8 Commune పబ్ వార్తల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. డిసెంబరు 2024లో బెంగళూరు నగర పాలక సంస్థ BBMP ఈ స్థలానికి ఫైర్ సేఫ్టీ అనుమతి లేని అంశంపై రెండవసారి నోటీసు జారీ చేసింది. జూలై 2024లో, One8 Commune నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 1:30 వరకు పని చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నిబంధనల ప్రకారం, రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది.
ఈ పరిణామాలు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. కోహ్లీ ఈ స్థలాన్ని ప్రమోట్ చేయడం, సహ యజమాని కావడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి, పబ్లిక్ హెల్త్ నియమాల ఉల్లంఘనలపై బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో ప్రముఖుల సంబంధిత వ్యాపారాలకూ ఈ చర్యలు వర్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!