Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
- బెంగళూరులోని One8 Commune బార్ అండ్ రెస్టారెంట్ పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు.
- టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ స్థలానికి సహ యజమానిగా ఉన్నారు.
- బార్ ప్రాంగణంలో స్పెషల్ స్మోకింగ్ జోన్ లేకపోవడం నిబంధనల ఉల్లంఘనగా గుర్తింపు.
- కేసు బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు. ఈ కేసును స్థానిక న్యాయస్థాన అనుమతి అనంతరం పోలీసులు నమోదు చేశారు.
Read Also: Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
మే 29 నుంచి బెంగళూరు పోలీసులు ధూమపాన నియమాల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా One8 Commune ప్రాంగణంలో ధూమపానం కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం లేకపోవడం పోలీసులు గుర్తించారు. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా ఉందని పోలీసుల అధికారులు పేర్కొన్నారు. FIRను బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు చేశారు. వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు అభిప్రాయపడ్డారు.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
నిజానికి One8 Commune పబ్ వార్తల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. డిసెంబరు 2024లో బెంగళూరు నగర పాలక సంస్థ BBMP ఈ స్థలానికి ఫైర్ సేఫ్టీ అనుమతి లేని అంశంపై రెండవసారి నోటీసు జారీ చేసింది. జూలై 2024లో, One8 Commune నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 1:30 వరకు పని చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నిబంధనల ప్రకారం, రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది.
ఈ పరిణామాలు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. కోహ్లీ ఈ స్థలాన్ని ప్రమోట్ చేయడం, సహ యజమాని కావడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి, పబ్లిక్ హెల్త్ నియమాల ఉల్లంఘనలపై బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో ప్రముఖుల సంబంధిత వ్యాపారాలకూ ఈ చర్యలు వర్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!