Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
- బెంగళూరులోని One8 Commune బార్ అండ్ రెస్టారెంట్ పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు.
- టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ స్థలానికి సహ యజమానిగా ఉన్నారు.
- బార్ ప్రాంగణంలో స్పెషల్ స్మోకింగ్ జోన్ లేకపోవడం నిబంధనల ఉల్లంఘనగా గుర్తింపు.
- కేసు బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు. ఈ కేసును స్థానిక న్యాయస్థాన అనుమతి అనంతరం పోలీసులు నమోదు చేశారు.
Read Also: Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Also Read
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
మే 29 నుంచి బెంగళూరు పోలీసులు ధూమపాన నియమాల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా One8 Commune ప్రాంగణంలో ధూమపానం కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం లేకపోవడం పోలీసులు గుర్తించారు. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా ఉందని పోలీసుల అధికారులు పేర్కొన్నారు. FIRను బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు చేశారు. వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు అభిప్రాయపడ్డారు.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
నిజానికి One8 Commune పబ్ వార్తల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. డిసెంబరు 2024లో బెంగళూరు నగర పాలక సంస్థ BBMP ఈ స్థలానికి ఫైర్ సేఫ్టీ అనుమతి లేని అంశంపై రెండవసారి నోటీసు జారీ చేసింది. జూలై 2024లో, One8 Commune నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 1:30 వరకు పని చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నిబంధనల ప్రకారం, రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది.
ఈ పరిణామాలు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. కోహ్లీ ఈ స్థలాన్ని ప్రమోట్ చేయడం, సహ యజమాని కావడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి, పబ్లిక్ హెల్త్ నియమాల ఉల్లంఘనలపై బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో ప్రముఖుల సంబంధిత వ్యాపారాలకూ ఈ చర్యలు వర్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్