Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
- బెంగళూరులోని One8 Commune బార్ అండ్ రెస్టారెంట్ పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు.
- టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ స్థలానికి సహ యజమానిగా ఉన్నారు.
- బార్ ప్రాంగణంలో స్పెషల్ స్మోకింగ్ జోన్ లేకపోవడం నిబంధనల ఉల్లంఘనగా గుర్తింపు.
- కేసు బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు. ఈ కేసును స్థానిక న్యాయస్థాన అనుమతి అనంతరం పోలీసులు నమోదు చేశారు.
Read Also: Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Also Read
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
మే 29 నుంచి బెంగళూరు పోలీసులు ధూమపాన నియమాల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా One8 Commune ప్రాంగణంలో ధూమపానం కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం లేకపోవడం పోలీసులు గుర్తించారు. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా ఉందని పోలీసుల అధికారులు పేర్కొన్నారు. FIRను బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు చేశారు. వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు అభిప్రాయపడ్డారు.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
నిజానికి One8 Commune పబ్ వార్తల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. డిసెంబరు 2024లో బెంగళూరు నగర పాలక సంస్థ BBMP ఈ స్థలానికి ఫైర్ సేఫ్టీ అనుమతి లేని అంశంపై రెండవసారి నోటీసు జారీ చేసింది. జూలై 2024లో, One8 Commune నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 1:30 వరకు పని చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నిబంధనల ప్రకారం, రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది.
ఈ పరిణామాలు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. కోహ్లీ ఈ స్థలాన్ని ప్రమోట్ చేయడం, సహ యజమాని కావడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి, పబ్లిక్ హెల్త్ నియమాల ఉల్లంఘనలపై బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో ప్రముఖుల సంబంధిత వ్యాపారాలకూ ఈ చర్యలు వర్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!