Megastar Chiranjeevi: మెగాస్టార్ ఖాతాలో మరో అవార్డ్.. అగ్ర నటుడికి అత్యున్నత గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రతిష్టాత్మకంగా “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (Gaddar Film Awards) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 ఏడాదికి సంబంధించి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేసింది. భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా సేవలు అందించిన మహానుభావులకు ఇచ్చే ఈ గౌరవం చిరంజీవికి దక్కడం సినీ ప్రపంచంలో నూతన ఉత్సాహాన్ని తెచ్చింది.
READ MORE: Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్లో భూకంపం.. 4.1గా నమోదు
Also Read
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ చిర స్థాయిగా నిలిచిపోయారు. తెలుగు రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు. అలాంటి గొప్పి వ్యక్తి అయిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకంగా అందజేసే ఈ గౌరవం దేశవ్యాప్తంగా చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలు చేసిన కళాకారులకు ఇస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని చిరంజీవి అందుకోవడం దశాబ్దాల ప్రయాణానికి వచ్చిన గొప్ప గుర్తింపుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి తన కెరీర్లో చాలా రకాల పాత్రలు పోషించారు. కింది స్థాయి నుంచి వచ్చిన ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లాది జనాల ఆదరణ పొందారు. ఈ తరుణంలో చిరంజీవికి వరుసగా గౌరవాలు లభిస్తున్నాయి. గతేడాది దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ లభించింది. అదే సమయంలో తన నటనా జీవితంలో సాధించిన విశేష విజయాలకుగాను గిన్నిస్ ప్రపంచ రికార్డుల నుంచీ గుర్తింపు లభించింది. ఈ రెండు గౌరవాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం రావడం చిరంజీవి కెరీర్లో మరొక గొప్ప ఘట్టంగా మారింది. చిరంజీవి సినీ ప్రయాణం కొత్త తరానికి కూడా ప్రేరణగా నిలుస్తోంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని శ్రమతో ఎదిగిన చిరూ కథ ఎంతోమంది యువ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ఇటీవల నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రాంతీయ స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. దర్శకుడు బాబీతో కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు భారీ కల్పిత కథతో తెరకెక్కుతున్న విశ్వంభర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ అవార్డు ప్రకటన విశేషంగా నిలిచింది.
తాజావార్తలు
-
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!