Viral Video: ఇటీవల కాలంలో బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం చూస్తున్నాం. చిన్నచిన్న విషయాలకు పక్కకు జనాలు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి కొట్టేసుకుంటున్నారు. వీటికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా బెంగళూర్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ బస్సులో ఇద్దరు మహిళలు దారుణంగా కొట్లాడారు. ఏకంగా బూట్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ ఎప్పుడూ ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్కు దగ్గరగా ఉంటోంది.. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..…
ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు…
ప్రయాణికులు చైన్ లాగా రైలును ఆపిన సంఘటనలు చాలా వినే ఉంటాం. ఏదైనా అత్యవసరమైతేనే చైన్ లాగుతారు. కానీ ఒక హంస మాత్రం ఎలాంటి సాయం లేకుండా వెళ్తున్న రైలును ఆపింది. ఇదెక్కడి ఆశ్చర్యమని అనుకుంటున్నారా.. ఇది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
ఇంగ్లీష్లో మాట్లాడమంటే చాలా కష్టం.. దానికి మొదటి నుంచి ఇంగ్లీష్ పై పట్టు ఉండాలి.. లేదంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకుని ఉంటే.. ఇంగ్లీష్ మాట్లాడలేము. డిగ్రీ, పీజీలు చదువుకున్న వాళ్లు కూడా ఇంగ్లీషులో మాట్లాడేందుకు అప్పుడప్పుడు తడబడుతుంటారు. కానీ.. ఒక గాజులు అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తే.. ఆశ్చర్యపోతారు. ఈ మహిళ గోవాలో గాజులు, ముత్యాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ మహిళ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుండగా.. ఆమె గోవా…
కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంప్రదాయ భారతీయ గేమ్ 'చిర్రగోనె' ఆడారు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాగా.. సింధియా చిర్రగోనె ఆడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. ఆ ఆట ఆడుతున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. చాలాసార్లు క్రికెట్ ఆడానని.. కానీ, ఈ ఆట ఆడటం చాలా సరదాగా ఉందని తెలిపారు.
లండన్ అండర్గ్రౌండ్ రైలులో ప్రయాణికులు కొట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్పై దాడులు చేస్తున్నట్ల మనం చూడొచ్చు.. ఓ వ్యక్తిని పట్టుకుని మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.
Maldives: హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం మాల్దీవులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. భారతదేశంతో వివాదం, ప్రధాని నరేంద్రమోడీ గురించి ఆ దేశ మంత్రులు అసభ్యకరంగా మాట్లాడటం ఒక్కసారిగా వివాదాస్పదమైంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు అనుకూలంగా, భారత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్జాతీయ మీడియాలో మాల్దీవులు హెడ్లైన్గా మారింది.
Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిల్ లైన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న స్కార్పియో ఓవర్టేక్ చేసే సమయంలో రెండు బైకులను, వెనక ఉన్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైంది.