Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో తన 75 ఏళ్ల అమ్మమ్మపై దాడి చేసినందుకు ఒక వ్యక్తి. అతని భార్యను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి మార్చి 28న తెలిపారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్ సేన్, అతని భార్య పూజా సేన్ నగరంలోని జహంగీరాబాద్, బర్ఖేడి నివాసితులుగా గుర్తించారు. భోపాల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP, జోన్ 1) ప్రియాంక శుక్లా మాట్లాడుతూ.., “రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ ఒక మహిళ వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ కాగా.. పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించినప్పుడు, నిందితులును దీపక్ సేన్గా గుర్తించారు. వీరు జహంగీరాబాద్లో నివసిస్తున్నారు. వీరు తమ అమ్మమ్మపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు.
Also read: Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
Also Read
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
వీడియో ఆధారంగా జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారిని గురువారం జైలుకు పంపినట్లు అధికారి తెలిపారు. “వృద్ధ మహిళ వాస్తవానికి ఝాన్సీకి చెందినది. కాకపోతే ఇక్కడ అతని మనవడి వద్ద నివసిస్తున్నారు. ఈ సంఘటన మార్చి 21 – 22 తేదీలలో జరిగి ఉండొచ్చు అని, కాకపోతే మార్చి 26 తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంఘటన తర్వాత, వృద్ధురాలిని ఝాన్సీకి తిరిగి పంపించారు. ఇక పూర్తి వివరాలకోసం ఆమెను కోసం తిరిగి ఇక్కడకు పిలిచారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తీవ్ర గాయాలైనట్లు తేలింది. ఆమె చెప్పిన దాని ఆధారంగా,.. ఈ విషయంలో మరిన్ని సెక్షన్లు పెరిగాయి. దాడికి గల కారణాలపై డీసీపీ శుక్లాను ప్రశ్నించగా.. ప్రాథమిక విచారణలో ఇంటి వివాదాలు, ఆస్తి సమస్యలు ఉన్నట్లు తేలిందని చెప్పారు.
Also read: CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ
ఐపీసీ సెక్షన్లు 294, 323, 325, 506, 342, 34 కింద కేసు నమోదు చేశామని, దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నామని అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా., తన మనవడు దీపక్, అతని భార్య తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, గత రెండు మూడు నెలలుగా ఇలాగే చేస్తున్నారని బాధితురాలు బతి సేన్ (75) తెలిపారు.
Watch: Bhopal police arrested a young couple after a video of a man and his wife, torturing their grandmother went viral on social media. #Bhopal#Bhopalviralvideo #ViralVideos pic.twitter.com/XjEMG7YiUQ
— The Theorist (@thetheorist_in) March 27, 2024
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?