ప్రస్తుతం కోవిడ్ అనే పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. 2020 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తిట్టుకునే పేర్లలో కచ్చితంగా కోవిడ్ ఉండి తీరుతుంది. కానీ కోవిడ్ అనే పేరు మనుషులకు ఉంటుందని మనం ఊహించగలమా? అయితే మన ఇండియాలో కోవిడ్ అనే పేరు గల మనిషి ఉన్నాడండోయ్. అతడి పూర్తి పేరు కోవిడ్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబై ఐఐటీలో చదువుకున్న కోవిడ్ కపూర్ ప్రస్తుతం బెంగళూరులోని ట్రావెల్ కంపెనీ హాలిడిఫై.కామ్ సహ…
ప్రతి మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు మనిషిని నాశనం చేస్తాయి. అలాంటి అలవాట్ల కారణంగా మనకు మనమే నాశనం అయిపోతాం. ఒకవేళ ఆ అలవాట్లు మీకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా… జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీకు గుణపాఠం నేర్పించడం ఖాయం. అవి ఏంటంటే… వాయిదా వేయడం, ఫిర్యాదు చేయడం, అతిగా ఆలోచించడం, పోల్చుకోవడం, సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం. ✪ వాయిదా వేయడం: ఏవేవో చేయాలనుకుంటాం.…
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా వుండే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సరదాగా సేదతీరారు. అది కూడా అండమాన్ దీవుల్లో. ఆయన చేసిన స్కూబా డైవింగ్ యువకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ స్కూబా డైవింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
గతంలో యూఎస్ కళాకారుడు రెండు చేతులతో ఒకేసారి రెండు బొమ్మలు గీయడం చూసి భారతదేశానికి చెందిన నురూల్ హాసన్ ఎంతో స్ఫూర్తి పొందాడు. దీంతో ఏకంగా యూఎస్ కళాకారుడికే ఛాలెంజ్ విసిరి ఒకే చేత్తో ఏకకాలంలో నాలుగు రకాల బొమ్మలు గీసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యస్వంత్ అందరినీ అబ్బురపరిచే విధంగా తనదైన రీతిలో రెండు చేతులు, రెండు కాళ్ళతో ఏకకాలంలో మొత్తం 12 బొమ్మల్ని గీసి వారెవ్వా…
సాధారణంగా హిందూ సంప్రదామా ప్రకారం బయటికి వెళ్ళేటప్పుడు. మంచి కార్యం చేపట్టేటప్పుడు ముహూర్తం చూస్తూ ఉంటారు. అది అందరికి తెలిసిందే. పెళ్ళికి, కార్యానికి, రాకపోకలకు మంచి ముహర్తంలో జరిగితే మంచి జరుగుతుందని నమ్మకం. అన్నంకాన్నే ఒక వివాహిత సాకుగా మార్చుకొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఏళ్లు భర్తకు దూరంగా ఉంది. భర్త దగ్గరకు వెళ్ళడానికి ముహూర్తం బాలేదని సాకు చెప్తూ 11 ఏళ్ళు కానిచ్చేసింది. దీంతో విసుగుచెందిన భర్త చివరికి కోర్టును ఆశ్రయించాడు.…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు కామంతో రగిలిపోతూ కామ వాంఛ తీర్చుకోవడానికి సిద్దమైపోతున్నారు. వావివరుస విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళను కొంతమంది వ్యక్తులు భర్త, కుమారుడి ముందే అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి, భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా…
1.బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా…
1.ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. 2.మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు…
వ్యాపారం కోసం నానా తంటాలు పడాలి. మొన్నటికి మొన్న చెన్నైలో బిర్యానీ కొంటే టమోటాలు ఫ్రీగా ఇచ్చాడో వ్యాపారి. తాజాగా హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం పెంచుకునేందుకు వినూత్నమయిన ఆఫర్ పెట్టాడో వ్యాపారి. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్లలో మటన్ పెట్టి అమ్ముతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో భూతరాజు శ్రీకాంత్ అనే వ్యాపారి…
చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల రోజుగా విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వానలు తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపి వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో…