Oil-Gas Shortage: యుద్ధం వేళ కేంద్రం గుడ్న్యూస్!.. చమురు, గ్యాస్పై కీలక సమాచారం
- యుద్ధం వేళ కేంద్రం గుడ్న్యూస్!
- చమురు, గ్యాస్పై కీలక ప్రకటన
- భయాందోళనలు తొలగినట్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదు రోజులుగా భీకర యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా దాడులు-ప్రతికార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. దీంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ప్రస్తుతం ఎక్కడికక్కడే చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సంక్షోభం రావొచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారతదేశంలో కూడా నిల్వలు కూడా తగ్గుపోతున్నాయని జోరుగా ప్రచారం జరిగింది.
ఇలాంటి వదంతుల నేపథ్యంలో కేంద్ర వర్గాల నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇంధన భద్రత విషయంలో భారతదేశం చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నట్లుగా కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిల్వలు ఉన్నాయని.. ప్రతి రోజూ స్టాక్ భర్తీ జరుగుతోందని తెలిపాయి. ఎల్పీజీ, ఎల్ఎన్జీ కొరత లేదని.. అలాగే ప్రపంచంలో కూడా ముడి చమురు కొరత కూడా లేదని.. భారతదేశం ఇతర సరఫరాదారులతో కూడా సంప్రదింపులు జరుపుతోందని వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఆస్ట్రేలియా, కెనడా కూడా భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ముందుకొచ్చాయని.. ఇతర ప్రత్యామ్నాయ వనరుల కోసం కూడా వెతుకుతున్నట్లు తెలిపింది. ఇటీవలే యూఏఈ, యూఎస్తో కూడా కొత్త ఒప్పందాలు జరిగినట్లుగా గుర్తుచేసింది. ప్రస్తుతం ముడి చమురు, ఎల్పీజీ కొనుగోలు చేయడానికి ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, వ్యాపారులతో చర్చలు జరుపుతోందని తెలిపాయి. భారతదేశం అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), పెట్రోలియం ఎగుమతి చేసే సంస్థల (OPEC)తో కూడా భారతదేశం చర్చలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశాయి. నౌకలకు బీమా పొందడానికి భారతదేశం యూఎస్తో చర్చలు జరుపుతోందని.. భారతదేశం రోజుకు రెండుసార్లు ఇంధన పరిస్థితిని సమీక్షిస్తోందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.
Government source say –
* India is in a very comfortable position in energy security. Current position of stock is comfortable. Stock is being replenished every day.
* No shortage of LPG or LNG. There is no shortage of Crude oil in the world. India is in touch with other… pic.twitter.com/09r88Hdv2Y
— ANI (@ANI) March 5, 2026
తాజావార్తలు
-
Mahesh Babu Birthday: మహేష్ బాబు బర్త్డేకు ఐకానిక్ బ్లాక్బస్టర్ రీరిలీజ్.. మళ్లీ సందడి చేయబోతున్న ‘దూకుడు’
-
Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
-
Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
-
West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
-
IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్లో భారీ మార్పు!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!