Pakistan: భయం గుప్పిట్లో పాకిస్థాన్.. కారణం ఇదే!
- పాక్కు తగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు..
- హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామం పాకిస్థాన్ను ఊపిరి ఆడనివ్వని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ప్రపంచ ఇంధన అవసరాలలో 20 శాతం వాటా హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిజానికి ప్రస్తుతం దాయాది దేశం భయం గుప్పిట్లో ఉంది. ఎందుకంటే దేశంలో ఎప్పుడు చమురు సంక్షోభం ముదురుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొనడంతో, అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
READ ALSO: OnePlus 15T: 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ 50MP కెమెరాతో.. వన్ ప్లస్ 15టీ వచ్చేస్తోంది..
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
పాకిస్థాన్లో ఇంధన ఎమర్జెన్సీ..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే 15 శాతం పెరిగాయి. త్వరలోనే చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులు నిలిచిపోవడంతో పాకిస్థాన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి, దేశంలో కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చమురు కంపెనీల లిక్విడిటీని కాపాడేందుకు ప్రతి వారం పెట్రోలియం ధరలను సవరించాలని నిర్ణయించింది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో, పాకిస్థాన్ ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు పెంచుకోవడంపై దృష్టి సారించింది.
పాక్ వద్ద ఉన్న నిల్వలు ఎంతంటే..
తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ వద్ద ఉన్న చమురు నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
ముడి చమురు (Crude Oil): కేవలం 10 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి.
పెట్రోలియం ఉత్పత్తులు: సుమారు 28 రోజులకు సరిపడా ఉన్నాయి.
LPG (వంట గ్యాస్): కేవలం 15 రోజులు మాత్రమే వస్తుంది.
దిగుమతులపై దెబ్బ..
పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, నైజీరియా వంటి దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే, హోర్ముజ్ మార్గం మూతపడటంతో ఈ సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాల కోసం అన్వేషిస్తోంది.
READ ALSO: Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!