Vikarabad: బస్సు నిండా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో అతివేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులు గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
ఈసారి తెలంగాణ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. గెలుపు అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విస్తృత ప్రచారాలు చేస్తున్నాయి. ఇందుకోసం రెండు పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి మద్దతుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేపట్టారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన వికారాబాద్ జిల్లా పరిగి చేరుకున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ సపోర్టు చేస్తూ రోడ్ షో నిర్వహించారు. Also Read: Indian…
KTR Road Show: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు.
మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు.
వికారాబాద్ జిల్లా పూడుర్ మండలంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల, గొరిల్లా గుట్ట, రహీం కోళ్లఫారం పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెసోళ్ళు గుడ్డీ గుర్రాల పండ్లు తోమారు అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏళ్ళ పాలనలో జరగనిది ఈ కాంగ్రెసు వాళ్ళు ఎలా చేస్తారు.
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని మారుముల ప్రాంతం తట్టేపల్లి గ్రామానికి పక్కనే కర్ణాటక రాష్ట్రం అనుకుని ఉండడంతో అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో కొంత మంది సారాయి తయారు కేంద్రాలను సృష్టిస్తున్నారు.
మాజీ మంత్రి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మొదటి రోజు మీడియా సమావేశం నిర్వహించి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు అని ఆరోపించారు. కోళ్ళ దాన కుంభకోణంలో 3 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు.
Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి…
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు.