Bengal Elections: మమతా సర్కారుకు షాక్.. సీఎస్, డీజీపీల ట్రాన్స్ఫర్..
- మమతా సర్కార్కు ఈసీ షాక్..
- డీజీపీ, సీఈఎస్ల బదిలీ..
- ఉన్నత పదవులకు కొత్త అధికారులు..
Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్కు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్ పోలీస్, బ్యూరోక్రసీలో కీలక అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ప్రస్తుతం డీజీపీ, ప్రధాన కార్యదర్శులను తొలగించి, ఆ పదవుల్లో కొత్త అధికారులను నియమించింది. సీనియర్ IAS అధికారి దుష్యంత్ నారియాలా, నందిని చక్రవర్తి స్థానంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతారు. పీయూష్ పాండే స్థానంలో ఉన్నత పోలీసు అధికారి సిద్ధ్ నాథ్ గుప్తా డీజీపీగా నియమితులయ్యారు. కోల్కతా పోలీసు కమిషనర్తో సహా మరో ముగ్గురు సీనియర్ అధికారులను కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఒక రోజు తర్వాత, ఎన్నికల సంఘం బెంగాల్లో కీలక అధికారులను బదిలీ చేసింది. 1992 బ్యాచ్ IPS అధికారి సిద్ధ్ నాథ్ గుప్తాను పశ్చిమ బెంగాల్ ఇన్చార్జ్ డైరెక్టర్ జనరల్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DG & IGP)గా నియమించారు. గుప్తా 30 ఏళ్ల కెరీర్లో కీలక స్థానాల్లో విధులు నిర్వహించారు. నందిగ్రామ్ అల్లర్లు, లాల్గఢ్ నక్సల్స్ ఉద్యమం, డార్జిలింగ్ గోర్ఖాలాండ్ ఆందోళలన సమయంలో ఆయన శాంతిభద్రతల్ని సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన అల్లర్లను అదుపు చేయడంతో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
మరోవైపు, సీనియర్ అధికారి అజయ్ కుమార్ నంద్, సుప్రతీమ్ సర్కార్ స్థానంలో కోల్కతా పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. అజయ్ ముకుంద్ రనడే అదనపు డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) గా నియమితులయ్యారు. బదిలీ అయిన అధికారుల్ని పూర్తిగా ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల విధుల్లో నియమించొద్దని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని, సంబంధిత అధికారులు మధ్యాహ్నం 3 గంటల లోపు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలీస్ అధికారులతో పాటు సీఎస్ నందిని చక్రవర్తి స్థానంలో దుష్యంత్ నరియాలా కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చక్రవర్తిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధుల్లో ఉంచొద్దని ఆదేశించింది. సంఘమిత్ర ఘోష్ను హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన తర్వాతే, ఈ ఇద్దరు అధికారులను బాధ్యతల నుండి తప్పించే నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?