Vikarabad: అనంతగిరిలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: బస్సు నిండా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో అతివేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులు గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన టీఎస్ 34 టీఏ 6363 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుంది. వికారాబాద్ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయల్దేరిన ఆర్టీసీ బస్సులో 90 మందికి పైగా ఉండగా, ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. రద్దీ దృష్ట్యా డ్రైవర్ బస్సును ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపేశాడు. అయితే అనంతపద్మనాభ స్వామి ఆలయం దాటిన తర్వాత ఘాట్ రోడ్డులో ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఎండీ షాపి బ్రేకులు ఫెయిల్ అయ్యాయని బస్సులోని వ్యక్తులకు చెబుతూనే బస్సును ముందుకు తోసాడు.
Read also: Prabhas: “రాజా సాబ్” కోసం భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్…
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
బస్సు అదుపు తప్పి బోల్తా పడకుండా పొదల్లోకి తీసుకుని వెళ్లాడు డ్రైవర్. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ చిన్నపాటి గాయాలు అయ్యాయి. దీంతో కొందరు ప్రయాణికులు 108కి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటా హుటిని ఘటన స్థలికి చేరుకున్నారు. గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారు మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చారు. విషయం తెలుసుకున్న ధరూర్, వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. అయితే సంవత్సరం క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విధంగా బస్సు ప్రమాదం జరిగి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందిన సంఘటన మరువక ముందే ఆదే ప్రదేశంలో ఇప్పుడు మళ్లీ అదే ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగడం సంచలనంగా మారింది. అయితే ఈ సారి అదృష్టం కొద్దీ బస్సు బోల్తా పడక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Kodi Pandelu: ఏపీలో జోరుగా కోడి పందాలు..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!