Vikarabad: అనంతగిరిలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: బస్సు నిండా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో అతివేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులు గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన టీఎస్ 34 టీఏ 6363 నెంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుంది. వికారాబాద్ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయల్దేరిన ఆర్టీసీ బస్సులో 90 మందికి పైగా ఉండగా, ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. రద్దీ దృష్ట్యా డ్రైవర్ బస్సును ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపేశాడు. అయితే అనంతపద్మనాభ స్వామి ఆలయం దాటిన తర్వాత ఘాట్ రోడ్డులో ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఎండీ షాపి బ్రేకులు ఫెయిల్ అయ్యాయని బస్సులోని వ్యక్తులకు చెబుతూనే బస్సును ముందుకు తోసాడు.
Read also: Prabhas: “రాజా సాబ్” కోసం భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్…
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
బస్సు అదుపు తప్పి బోల్తా పడకుండా పొదల్లోకి తీసుకుని వెళ్లాడు డ్రైవర్. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ చిన్నపాటి గాయాలు అయ్యాయి. దీంతో కొందరు ప్రయాణికులు 108కి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటా హుటిని ఘటన స్థలికి చేరుకున్నారు. గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారు మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చారు. విషయం తెలుసుకున్న ధరూర్, వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. అయితే సంవత్సరం క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విధంగా బస్సు ప్రమాదం జరిగి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందిన సంఘటన మరువక ముందే ఆదే ప్రదేశంలో ఇప్పుడు మళ్లీ అదే ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగడం సంచలనంగా మారింది. అయితే ఈ సారి అదృష్టం కొద్దీ బస్సు బోల్తా పడక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Kodi Pandelu: ఏపీలో జోరుగా కోడి పందాలు..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!