Vikarabad Crime: వికారాబాద్ జిల్లాలో విషాదం.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి గ్రామంలో పలువురి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు.
Read also:Telangana: BRS నాయకులకు మావోయిస్టుల హెచ్చరిక..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కోసం వెంకటేష్ తల్లిని నిలదీశారు. దీనితో ఆమె తన కొడుకు వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పింది. కాగా పండుగకు వెంకటేష్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన సదరు వ్యక్తులు వెంకటేష్ ని డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. దీనితో తాను ఇంటికి వచ్చినట్టు తన తల్లి అప్పులవాళ్ళకి చెప్పిందనే అనుమానంతో తల్లి పైన కక్ష పెంచుకున్నాడు. కాగా సమయం కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ తన తల్లి అంజమ్మ నిద్రపోతుండగా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెరువులో పడేసాడు. కాగా తల్లి కనిపించకపోవడంతో అంజమ్మ మరో కొడుకు పోలీసులకు పిర్యాదు చేసాడు. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. కాగా అంజమ్మ మృత దేహం ఇంకా చెరువులోనే ఉంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!