Vikarabad Crime: వికారాబాద్ జిల్లాలో విషాదం.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి గ్రామంలో పలువురి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు.
Read also:Telangana: BRS నాయకులకు మావోయిస్టుల హెచ్చరిక..
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కోసం వెంకటేష్ తల్లిని నిలదీశారు. దీనితో ఆమె తన కొడుకు వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పింది. కాగా పండుగకు వెంకటేష్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన సదరు వ్యక్తులు వెంకటేష్ ని డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. దీనితో తాను ఇంటికి వచ్చినట్టు తన తల్లి అప్పులవాళ్ళకి చెప్పిందనే అనుమానంతో తల్లి పైన కక్ష పెంచుకున్నాడు. కాగా సమయం కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ తన తల్లి అంజమ్మ నిద్రపోతుండగా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెరువులో పడేసాడు. కాగా తల్లి కనిపించకపోవడంతో అంజమ్మ మరో కొడుకు పోలీసులకు పిర్యాదు చేసాడు. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. కాగా అంజమ్మ మృత దేహం ఇంకా చెరువులోనే ఉంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!