తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…
విజయవాడ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సత్యానందంను పటమట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అటు కమిషనరేట్లో ఉన్న ఎంవీ దుర్గారావును కృష్ణలంక పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పటమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డిని సిటీ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న…
విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.. 2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో అచ్చెన్నకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు లోకేష్.. అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు హాజరయ్యారు కొల్లు రవీంద్ర.. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్…
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.. డ్రగ్స్ కొరియర్ కేస్ చిక్కు ముడి విడకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నిందితుల నుండి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క ప్లాన్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు.. మరో ముగ్గురూ పరారీ అయినట్టుగా చెబుతున్నారు.. ఎనర్జీ బూస్ట్లో ఉపయోగించే మెధాంఫిటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.. కర్నూల్ డ్రగ్స్ విక్రయాలతో విజయవాడ యువకుల…
బెజవాడలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధర ఏకంగా 70 రూపాయలకు చేరింది. రెండు నెలల క్రితం నగరంలో కేజీ టమాటా 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడా ధర వంద రూపాయలకు చేరుకునేలా ఉంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్తో పంట నష్టపోవటమే రేట్లు పెరగటానికి కారణం అంటున్నారు వ్యాపారులు. Read Also: IPS Pratap Reddy: బెంగళూరు సీపీగా ఏపీ సీనియర్ ఐపీఎస్.. మరోవైపు,…
విజయవాడలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. స్విగ్గీ సంస్థ పని గంటలు పెంచడంతో పాటు ఇన్సెంటివ్స్ తగ్గించడంతో డెలివరీ బాయ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఇన్సెంటివ్స్ తగ్గించిన నేపథ్యంలో తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెంచకుండా తగ్గించటం పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడినా తమకు రూ.270 మాత్రమే వస్తున్నాయని.. పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా తొలగించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. Read Also: Illegal Affairs: ఏపీలో మగాళ్లు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విజయవాడ ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిషేధిత ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న అరుణాచలం ను ముందుగా కస్టడీకి తీసుకోనున్నారు బెజవాడ పోలీసులు. డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులతో సంయుక్తంగా నిందితులను పట్టుకునేందుకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అరుణాచలం ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారని తెలుస్తోంది.…
నేడు రాజ్ భవన్ ను ముట్టడించేందుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో పోలీసులు బందోబస్తు ముమ్మరం చేశారు. ఛలో రాజ్ భవన్ నిరసనకు రాయలసీమ జిల్లాలనుంచి విద్యార్ధులు తరలివస్తున్నారు. ఈ ఆందోళనకు అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం అంటూ సీపీ హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్యర్యంలో నిరసనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూల్ రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అనంద్ రావు నీ రీకాల్…