Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
- ఢిల్లీలో మరో ఘోరం
- ఓపెన్ మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
- రేఖా గుప్తా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజం
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవల గుంతలో పడి బైకర్ చనిపోయిన సంఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఓపెన్ మ్యాన్హోల్లో పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
ఇటీవల ఢిల్లీలో జల్ బోర్డు అధికారులు నడిరోడ్డుపై గుంత తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. దీంతో ఒక బైకర్ తెలియకుండా వచ్చేయడంతో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఘటన జరిగి 5 రోజులు కాకముందే మరో ఘోరం జరిగింది మ్యాన్హోల్ను ఓపెన్ చేసి ఉంచడంతో యువకుడు బిర్జు కుమార్ (30) మృతి చెందాడు. ఒక దుర్ఘటన జరిగి పెద్ద రాద్ధాంతం జరిగినా కూడా అధికారులు పాఠం నేర్చుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం పోయింది.
ఇది కూడా చదవండి: Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్లో!
రోహిణిలోని బేగంపూర్ ప్రాంతంలో మహాశక్తి కాళి ఆలయానికి సమీపంలోని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) భూమిలోని మ్యాన్హోల్ ఓపెన్ చేసిందని.. అయితే 30 ఏళ్ల బిర్జు కుమార్ అనే కార్మికుడు, అతని స్నేహితుడు ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బిర్జు కుమార్, స్నేహితుడు కూడా కార్మికులేనని.. ఇద్దరూ రోజంతా మద్యం సేవించి ఉన్నారని.. సంఘటన జరిగిన సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్నారని వెల్లడించారు.
బిర్జు కుమార్ సోమవారం రాత్రి పడిపోగా.. మరుసటి రోజు మృతదేహం లభించింది. బిర్జు కుమార్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించానని, కానీ స్పందన రాలేదని, బాగా తాగి ఉండటంతో ఇంటికి వెళ్లానని స్నేహితుడు చెప్పాడు. మరుసటి రోజు కూడా కుమార్ జాడ తెలియకపోవడంతో ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టగా మ్యాన్హోల్ పక్కన అతని చెప్పులు కనిపించాయని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుమార్ మృతదేహాన్ని మురుగు కాలువ నుంచి వెలికితీసిన తర్వాత ఆయన మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు బీహార్లోని సమస్తిపూర్కు చెందినవాడిగా గుర్తించారు.
ఈ ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. రేఖ గుప్తా ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ప్రసంగాలపై ఉన్న శ్రద్ధ… ప్రభుత్వాన్ని నడపడడం చేతకావడం లేదని మండిపడ్డారు.
#WATCH | Delhi: A 32-year-old man died after falling into an open drain in Rohini Sector 32, near Mahashakti Kali Temple. Visuals from the spot. https://t.co/trUzf8715N pic.twitter.com/zsDIGROGyR
— ANI (@ANI) February 10, 2026
ब्रेकिंग (शर्मनाक)
दो आदमी दिल्ली के रोहिणी सेक्टर 32 में सड़क पर जा रहे थे , चलते चलते उनके से एक गड्ढे में गिरा । जहाँ गिरा वो गड्ढ़ा एक गेहरा नाला था।
लाश भी नहीं मिली ।
रेखा गुप्ता की सरकार सिर्फ़ फोटोबाज़ी और भाषणबाज़ी की नकारा सरकार है । इनको सरकार नहीं चलानी , सिर्फ़…
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 10, 2026
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!