Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
- ఢిల్లీలో మరో ఘోరం
- ఓపెన్ మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
- రేఖా గుప్తా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవల గుంతలో పడి బైకర్ చనిపోయిన సంఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఓపెన్ మ్యాన్హోల్లో పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇటీవల ఢిల్లీలో జల్ బోర్డు అధికారులు నడిరోడ్డుపై గుంత తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. దీంతో ఒక బైకర్ తెలియకుండా వచ్చేయడంతో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఘటన జరిగి 5 రోజులు కాకముందే మరో ఘోరం జరిగింది మ్యాన్హోల్ను ఓపెన్ చేసి ఉంచడంతో యువకుడు బిర్జు కుమార్ (30) మృతి చెందాడు. ఒక దుర్ఘటన జరిగి పెద్ద రాద్ధాంతం జరిగినా కూడా అధికారులు పాఠం నేర్చుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం పోయింది.
ఇది కూడా చదవండి: Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్లో!
రోహిణిలోని బేగంపూర్ ప్రాంతంలో మహాశక్తి కాళి ఆలయానికి సమీపంలోని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) భూమిలోని మ్యాన్హోల్ ఓపెన్ చేసిందని.. అయితే 30 ఏళ్ల బిర్జు కుమార్ అనే కార్మికుడు, అతని స్నేహితుడు ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బిర్జు కుమార్, స్నేహితుడు కూడా కార్మికులేనని.. ఇద్దరూ రోజంతా మద్యం సేవించి ఉన్నారని.. సంఘటన జరిగిన సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్నారని వెల్లడించారు.
బిర్జు కుమార్ సోమవారం రాత్రి పడిపోగా.. మరుసటి రోజు మృతదేహం లభించింది. బిర్జు కుమార్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించానని, కానీ స్పందన రాలేదని, బాగా తాగి ఉండటంతో ఇంటికి వెళ్లానని స్నేహితుడు చెప్పాడు. మరుసటి రోజు కూడా కుమార్ జాడ తెలియకపోవడంతో ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టగా మ్యాన్హోల్ పక్కన అతని చెప్పులు కనిపించాయని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుమార్ మృతదేహాన్ని మురుగు కాలువ నుంచి వెలికితీసిన తర్వాత ఆయన మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు బీహార్లోని సమస్తిపూర్కు చెందినవాడిగా గుర్తించారు.
ఈ ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. రేఖ గుప్తా ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ప్రసంగాలపై ఉన్న శ్రద్ధ… ప్రభుత్వాన్ని నడపడడం చేతకావడం లేదని మండిపడ్డారు.
#WATCH | Delhi: A 32-year-old man died after falling into an open drain in Rohini Sector 32, near Mahashakti Kali Temple. Visuals from the spot. https://t.co/trUzf8715N pic.twitter.com/zsDIGROGyR
— ANI (@ANI) February 10, 2026
ब्रेकिंग (शर्मनाक)
दो आदमी दिल्ली के रोहिणी सेक्टर 32 में सड़क पर जा रहे थे , चलते चलते उनके से एक गड्ढे में गिरा । जहाँ गिरा वो गड्ढ़ा एक गेहरा नाला था।
लाश भी नहीं मिली ।
रेखा गुप्ता की सरकार सिर्फ़ फोटोबाज़ी और भाषणबाज़ी की नकारा सरकार है । इनको सरकार नहीं चलानी , सिर्फ़…
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 10, 2026
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!