Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
- ఢిల్లీలో మరో ఘోరం
- ఓపెన్ మ్యాన్హోల్లో పడి యువకుడి మృతి
- రేఖా గుప్తా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవల గుంతలో పడి బైకర్ చనిపోయిన సంఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఓపెన్ మ్యాన్హోల్లో పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఢిల్లీలో జల్ బోర్డు అధికారులు నడిరోడ్డుపై గుంత తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. దీంతో ఒక బైకర్ తెలియకుండా వచ్చేయడంతో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఘటన జరిగి 5 రోజులు కాకముందే మరో ఘోరం జరిగింది మ్యాన్హోల్ను ఓపెన్ చేసి ఉంచడంతో యువకుడు బిర్జు కుమార్ (30) మృతి చెందాడు. ఒక దుర్ఘటన జరిగి పెద్ద రాద్ధాంతం జరిగినా కూడా అధికారులు పాఠం నేర్చుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం పోయింది.
ఇది కూడా చదవండి: Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్లో!
రోహిణిలోని బేగంపూర్ ప్రాంతంలో మహాశక్తి కాళి ఆలయానికి సమీపంలోని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) భూమిలోని మ్యాన్హోల్ ఓపెన్ చేసిందని.. అయితే 30 ఏళ్ల బిర్జు కుమార్ అనే కార్మికుడు, అతని స్నేహితుడు ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బిర్జు కుమార్, స్నేహితుడు కూడా కార్మికులేనని.. ఇద్దరూ రోజంతా మద్యం సేవించి ఉన్నారని.. సంఘటన జరిగిన సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్నారని వెల్లడించారు.
బిర్జు కుమార్ సోమవారం రాత్రి పడిపోగా.. మరుసటి రోజు మృతదేహం లభించింది. బిర్జు కుమార్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించానని, కానీ స్పందన రాలేదని, బాగా తాగి ఉండటంతో ఇంటికి వెళ్లానని స్నేహితుడు చెప్పాడు. మరుసటి రోజు కూడా కుమార్ జాడ తెలియకపోవడంతో ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టగా మ్యాన్హోల్ పక్కన అతని చెప్పులు కనిపించాయని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుమార్ మృతదేహాన్ని మురుగు కాలువ నుంచి వెలికితీసిన తర్వాత ఆయన మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు బీహార్లోని సమస్తిపూర్కు చెందినవాడిగా గుర్తించారు.
ఈ ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. రేఖ గుప్తా ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ప్రసంగాలపై ఉన్న శ్రద్ధ… ప్రభుత్వాన్ని నడపడడం చేతకావడం లేదని మండిపడ్డారు.
#WATCH | Delhi: A 32-year-old man died after falling into an open drain in Rohini Sector 32, near Mahashakti Kali Temple. Visuals from the spot. https://t.co/trUzf8715N pic.twitter.com/zsDIGROGyR
— ANI (@ANI) February 10, 2026
ब्रेकिंग (शर्मनाक)
दो आदमी दिल्ली के रोहिणी सेक्टर 32 में सड़क पर जा रहे थे , चलते चलते उनके से एक गड्ढे में गिरा । जहाँ गिरा वो गड्ढ़ा एक गेहरा नाला था।
लाश भी नहीं मिली ।
रेखा गुप्ता की सरकार सिर्फ़ फोटोबाज़ी और भाषणबाज़ी की नकारा सरकार है । इनको सरकार नहीं चलानी , सिर्फ़…
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 10, 2026
తాజావార్తలు
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!