ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు.
వైకుంఠ ఏకాదశి వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.. వైష్ణవాలయాలు తెల్లవారుజామునుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, రెండు రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాలు సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది.. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా…