Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి వెనకున్న నమ్మకం ఇదే..
Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అందరూ విష్ణుమూర్తిని దర్శించుకోడానికి ఆలయాల్లో బారులు తీరుతుంటారు. ఈ రోజున తిరుమలతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇంతకీ అసలు వైకుంఠ ఏకాదశికి అంటే ఏమిటి, దానికి ఎందుకని అంత ప్రాధాన్యత ఉంది, దీని వెనకున్న నమ్మకాలేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Unnao Rape Case: ‘అప్పుడే నా తండ్రికి, నాకు న్యాయం జరుగుతుంది’..: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు
Also Read
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుతూ.. ”వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారమే వైకుంఠ ద్వారం. దేవతల పరంగా చూసుకుంటే, స్వామివారు నిద్ర నుంచి లేచి ముక్కోటి దేవతలకు సుప్రభాత దర్శనం ఇస్తారు. దేవకాలంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు చీకటి. ఏడాదంతా ఒక రోజుగా భావిస్తే, రాత్రి తొలగి, పగలు ప్రారంభమయ్యే ముందు, స్వామి వారు దేవతలకు తన దర్శనం ఇస్తారు.” అని చెప్పారు. అందుకే ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి శ్రీమహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి భూమి మీదకు వచ్చినందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చినట్లు చెబుతారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు ఉండే మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది.
టీటీడీ ప్రచురించిన ఒక పుస్తకంలో వైకుంఠ ఏకాదశి అంటే గుడిలో ఉండే వైకుంఠ ద్వారం ఒక రోజంతా తెరచివుంచే మహోత్సవం అని పేర్కొన్నారు. అలాగే ఈ పుస్తకంలో సంవత్సరానికి ఒకే ఒక్కమారు లభించే మహా భాగ్యం.. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారి సేవ అని, మరునాటి ద్వాదశి పుష్కరిణీ చక్రస్నానం అనేక కోట్ల జన్మల పుణ్యఫలమని తెలిపింది. తిరుమలలో ఏడాదికి నాలుగుసార్లు చక్రస్నానం జరుగుతుంది. ఈ నాలుగు సార్లు ఏంటంటే.. అనంత పద్మనాభవ్రతం, బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ఏకాదశి మరునాడు వచ్చే ద్వాదశి రోజున, రథసప్తమి మధ్యాహ్నం.. అని వెల్లడించారు.
శ్రీమహావిష్ణువుని ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షస సమూహానికి శాపవిమోచనం కలిగిందట. నాటి నుంచి విష్ణువును ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారో వారికి తమ లాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులనే రాక్షస సమూహం కోరుకోవడంతో వైకుంఠ ద్వార దర్శనానికి ప్రాధాన్యత సంతరించుకుందట.
READ ALSO: Karthi: ‘నీలకంఠ’ మూవీ ఘన విజయం సాధించాలి: హీరో కార్తీ
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!