బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.
ఐపీఎల్ 2025 వేలంలో 10 ఫ్రాంచైజీలు మొత్తం 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్పై భారీ ధర పలికింది. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విధంగా ఐపీఎల్ 2025 వేలంలో భారీ ధరకు అమ్ముడైన క్రికెటర్గా రిషబ్ పంత్ నిలిచాడు. మరోవైపు.. పిన్న వయస్సు ఉన్న ఆటగాళ్లను ఈ వేలంలో కొనుగోలు చేశారు.
ఐపీఎల్ మెగా వేలంలో ఎంతగానో ఎదురు చూసిన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ అమ్ముడుపోయాడు. 13 ఏళ్ల ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ను అనుకున్న ధర కంటే ఎక్కువగానే కొనుగోలు చేసింది. బీహార్కు చెందిన వైభవ్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. అతని బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు. చివరకు ఆర్ఆర్ జట్టు ఇతన్ని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించనున్న మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ భారీ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది.
Vaibhav Suryavanshi Record for India: చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య అండర్-19 టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన యూత్ టెస్టు సెంచరీని సూర్యవంశీ నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 58 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ అగ్ర స్థానంలో ఉన్నాడు. అలీ 2005లో 56 బంతుల్లో వేగవంతమైన సెంచరీ చేశాడు.…
Bihar Cricketer Vaibhav Suryavanshi created history in Ranji Trophy 2023-24: బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా శుక్రవారం (జనవరి 5) ముంబైతో మొదలైన మ్యాచ్లో వైభవ్ బీహార్ తరఫున బరిలోకి దిగాడు. 1942–43 సీజన్లో 12…