Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- ట్రంప్ సంచలన ప్రకటన
- హార్ముజ్ కార్గో ఫీజు రద్దు
- ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ప్రతిపాదించిన 20 శాతం కార్గో ఫీజును వెనక్కి తీసుకున్నారు. దానికి బదులుగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్కు సంబంధించిన నౌకలపై పూర్తి దిగ్బంధం అమలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రత కోసం అమెరికా చేస్తున్న ఖర్చును భర్తీ చేయాలనే ఉద్దేశంతో కార్గోపై 20 శాతం రీయింబర్స్మెంట్ ఫీజు విధించాలని ట్రంప్ గతంలో ప్రతిపాదించారు. అయితే ఈ నిర్ణయం ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమలో ఆందోళనకు దారితీసింది. రవాణా వ్యయాలు, చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read
- Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
తాజాగా సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన పోస్టులో మధ్యప్రాచ్య దేశాల నాయకులతో అత్యంత ఫలప్రదమైన చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘‘మధ్యప్రాచ్య నాయకత్వంతో జరిగిన విజయవంతమైన చర్చల ఆధారంగా అమెరికా రీయింబర్స్మెంట్ ఫీజును రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు చేస్తాయి.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కార్గో ఫీజు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూనే.. ఇరాన్కు చెందిన నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి అన్ని దేశాల నౌకలకు తెరిచి ఉంటుంది. కానీ ఇరాన్కు మాత్రం కాదు.’’ అని స్పష్టంచేశారు. ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలు, అలాగే ఇరాన్ సరుకును తీసుకెళ్లే ఏ నౌకనైనా పూర్తిగా దిగ్బంధం చేస్తామని ప్రకటించారు. అయితే ఈ దిగ్బంధం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం దీన్ని ఎలా అమలు చేస్తారు? అనే అంశాలపై ట్రంప్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. వైట్ హౌస్ కూడా దీనిపై అదనపు సమాచారం ఇవ్వలేదు.
ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం కార్గో ఫీజుకు ఆయన ప్రభుత్వంలోని పలువురు సీనియర్ అధికారులు కూడా వ్యతిరేకించినట్లు సమాచారం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంతర్జాతీయ జలమార్గాలపై టోల్ ఫీజులు విధించకూడదని గతంలోనే అభిప్రాయపడ్డారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు కూడా ఇదే వైఖరిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో భారీ పెట్టుబడులు
గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నాయని.. దీనివల్ల తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని ట్రంప్ తెలిపారు. అయితే ఏయే దేశాలతో ఒప్పందాలు కుదిరాయన్న విషయాన్ని వెల్లడించలేదు.
ఇరాన్పై మరోసారి తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్.. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలను సొంతం చేసుకోనివ్వబోమని స్పష్టం చేశారు. ‘‘వందల వేల మందిని చంపే రోజులు ఇరాన్కు ముగిశాయి. ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను పొందదు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో, ఈ ప్రాంతంలో అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఇంధన మార్కెట్లు, షిప్పింగ్ సంస్థలు, ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి.

- Tags
- Donald Trump
- Hormuz
- Iran
- trump
తాజావార్తలు
-
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
-
YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
-
Shweta Singh: సుశాంత్ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!