వైభవ్ సూర్యవంశీ… గత నెల రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. 14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ కుర్రాడు తొలి మ్యాచ్ లోనే 34 పరుగలతో ఆశ్చర్యపరిచాడు. రెండో మ్యాచ్ లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ తాజాగా గుజరాత్ పై చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఇషాంత్ శర్మ, సిరాజ్ లాంటి సీనియర్ బౌలర్లను ఎదుర్కొంటు పరుగుల వరద పారించాడు. 17 బంతులకే హాఫ్ సెంచరీ చేసి,,…
Vaibhav Suryavanshi: జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో వైభవ్ అర్ధ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ శతకం చేశాడు.…
యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్కు చెందిన వైభవ్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్…
Vaibhav Suryavanshi :ఐపీఎల్ లోనే అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేసిన వైభవ్.. తొలి మ్యాచ్ లో కూడా అదరగొట్టేశాడు. 14 ఏళ్ల 23 రోజులకే ఐపీఎల్ లోకి అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ రోజు తన తొలి మ్యాచ్ ను ఆడాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్.. ఈ రోజు లక్నో తో జరుగుతున్న మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. తొలి బంతినే సిక్స్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (76; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (67; 51 బంతుల్లో 4…
అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్నైట్ స్టార్గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది.
ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.