భారత యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’ కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా.. సిక్సులు బాదేస్తున్నాడు. 14 ఏళ్ల వైభవ్ గత ఏడాది కాలంగా దేశవాళీ, అండర్-19 క్రికెట్లో సులువుగా సెంచరీలు చేస్తున్నాడు. ముఖ్యంగా గత నెల రోజుల్లో సునామీ ఇన్నింగ్స్లు ఆడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. యువ సంచలనం వైభవ్ ఆటకు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. భారీ స్కోర్లను పోల్చుతూ.. ఏంటి తమ్ముడు ఈ అరాచకం అంటూ…
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఎక్కడ చూసిన మనోడి పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా చెలరేగిపోతున్నాడు మైదానంలో. తాజాగా దక్షిణాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో ఇండియా అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన మూడవ వన్డేలో వైభవ్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. యూత్ వన్డేలో సూర్యవంశీకి ఇది మూడవ సెంచరీ. ఈ ఇన్నింగ్స్తో యూత్ వన్డేలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19…
భారత అండర్-19 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా బెనోనీ లోని విల్లోమూర్ పార్క్లో జరిగిన రెండో యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి.. యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయుష్ మాథ్రే గైర్హాజరీలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా…
ఇటీవలె అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాక్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పుడు 2026 ఐసిసి పురుషుల అండర్-19 ప్రపంచ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనున్న ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) శనివారం జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో ఆయుష్ మాత్రే భారత జట్టుకు కెప్టెన్గా…
తుఫాన్ ఇన్నింగ్స్ తో క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసున్న వైభవ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డును ప్రదానం చేశారు. దేశీయ క్రికెట్లో అద్భుతమైన పర్ఫామెన్స్ తర్వాత వైభవ్కు ఈ గౌరవం లభించింది. ఈ వారం ప్రారంభంలో, విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై…
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24న బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, 15 సిక్స్కు ఉండడం విశేషం. లిస్ట్-ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు)గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. అయితే బీహార్ తరఫున రెండవ మ్యాచ్లో…
క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్ కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బిహార్ యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్, సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో…
Bihar vs AP: విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు అరుణాచల్ ప్రదేశ్పై రికార్డు విజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్లో బీహార్ 397 పరుగుల తేడాతో గెలిచి విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. Sakibul…
బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించి నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్మన్గా కిషన్ నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు బీహార్కు చెందిన సకిబుల్ గని పేరిట ఉంది, కిషన్ బుధవారం…
IND vs PAK: భారత అండర్–19 జట్టు మరోసారి జూనియర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే, రికార్డు స్థాయిలో 12వ టైటిల్ను సొంతం చేసుకునే అవకాశం భారత్కు దక్కుతుంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత జట్టు మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగనుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన…