Maharashtra: ప్రస్తుతం సోషల్ మీడియాలు చిన్నారులపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీ తెలియన ప్రాయంలో స్నేహం, లవ్ వంటివి మైనర్లను ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 11 ఏళ్ల బాలికకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిపి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చేలా సదరు బాలికను నిందితుడైన వ్యక్తి ప్రేరేపించాడు.
New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగుతోంది. కొత్త పార్లమెంట్ లో కార్పెట్ చాలా అందంగా ఉండటంతో ఇప్పుడు దానిపై చర్చ మొదలైంది. 900 మంది కార్మికులు ఏకంగా 10 లక్షల పనిగంటల పాటు నేయడం వల్ల ఈ తివాచీలు తయారయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ కళాకారులు ఈ తివాచీ తయారీలో పాలుపంచుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ కార్పెట్లపై జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్ఫం కమలం బొమ్మల్ని అద్బుతంగా తీర్చిదిద్దారు.
True Friend : స్నేహితుడి మృతితో ఓ యువకుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని మరణాన్ని తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితుడి అంత్యక్రియల చితిపైకి దూకాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో వెలుగు చూసింది.
Kanpur: ఉత్తర్ ప్రదేశ్ లో 100 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదైంది. కాటికి కాలి చాపే వయసులో పోలీస్ ఎఫ్ఐఆర్ లోకి ఎక్కింది. సరిగ్గా నడవడం రాని, కళ్లు సరిగ్గా కనిపించని 100 ఏళ్ల వృద్ధురాలు చంద్రకాళి రౌడీయిజం చలాయించింది. ఓ భూతగాదా విషయంలో ఆమెపై మాధురి అనే మహిళ కేసు పెట్టింది. ఈ వివాదంతో రూ.10 లక్షలు ఇవ్వాలని మాధురిని బెదిరించిందనే ఆరోపణలపై పోలీసులు వృద్దురాలి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జోరుగా కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం జనవరిలో రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధురలో 75 ఏళ్ల పూజారిని గుర్తు తెలియన దుండగులు కొట్టి చంపారు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తిని హరిదాస్ మహారాజ్ గా గుర్తించారు. కాళ్లు, చేతులను వెనక్కి కట్టేసి, తలపై ఇటుకతో మోది హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Uttar Pradesh: ముగ్గురు వ్యక్తులు తన భార్య, 14 ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో ఈ ఘటన జరిగింది.
Marriage Cancellation: ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.