Atiq Ahmed Murder: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జ్యూడీషియల్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్…
Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అతడితో పాటు ఆయన తమ్ముడు అష్రాఫ్ ను ముగ్గురు వ్యక్తులు, జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరిని ప్రయాగ్ రాజ్ లో ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి.
Dogs Attack: ఇటీవల దేశంలో చాలా ప్రాంతాల్లో కుక్కల దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా కుక్కల దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వీటికి ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి చనిపోయే వరకు కరిచి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…
Judicial Commission To Probe Atiq Ahmed Killing: దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య. శనివారం రాత్రి పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలకు వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపంలో నుంచి అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
After Atiq Ahmed Murder, Centre Prepares Advisory For Journalists: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీస్ కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్ అతని సోదరులు అఫ్రాప్ అహ్మద్ లను పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చిచంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అఫ్రాఫ్ లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు నిందితులు దగ్గర నుంచి కాల్చి చంపారు.
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో తిరుగులేని డాన్ గా ఎదిగాడు. చివరి రోజులను మాత్రం సీఎం యోగి ఆదిత్య నాథ్ దెబ్బకు బయపడుతూ బతికాడు. ఉత్తర్ ప్రదేశ్ వస్తే ఎప్పుడు ఎన్ కౌంటర్ అవుతానో అని తీవ్రంగా భయపడేవాడు. శనివారం రాత్రి ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్ తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు.
Uttar Pradesh: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
Shahjahanpur Accident: ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గర్రా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. 42 మందితో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా వంతెనపై నుంచి కింద పడింది. తిల్హార్ పోలీస్ స్టేషన్లోని బిర్సింగ్పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం పంపి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహ్రైచ్కు తరలించారు.