Uttar Pradesh: భజన కీర్తన పాడడని ఆగ్రహించిన ముస్లింలు.. దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో ఘోరమైన ఘటనలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. అయితే, తాజాగా ముజఫర్నగర్లో భజన కీర్తన పాడినందుకు వివాదంలో చిక్కుకున్న ముస్లిం గాయకుడి సోదరుడు ని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఖుర్షీద్.. సింగర్ ఫర్మానీ నాజ్ కి వరుసకు తమ్ముడవుతాడని పోలీసులు పేర్కొన్నారు. రతన్పురిలోని ముహమ్మద్పూర్ మాఫీ గ్రామంలో శనివారం రాత్రి ఈ దారుణమైన ఘటన జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Read Also: Mukesh Ambani Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం
Also Read
ఇక, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ శ్రీవాస్తవ తెలిపారు. శివుడిని స్తుతిస్తూ భక్తిగీతమైన నాజ్ గత సంవత్సరం హర్ హర్ శంభు అంటూ సాగే పాటను పాడాడు.. దీన్ని దేవ్బంద్ కు చెందిన ఓ మతగురువుతో అన్-ఇస్లామిక్, హరామ్ అని మతవిశ్వాసాలకు విరుద్ధమని ఫర్మానా జారీ చేశారు అని పోలీసుల విచారణలో తెలింది.
Read Also: Kishan Reddy: గద్దర్ లేని పాట మూగబోయింది..
దీనికి జవాబుగా కళాకారులకు మతం లేదని, తాను తప్పు చేయలేదని ముజఫర్నగర్కు చెందిన నాజ్ తనను తాను సమర్థించుకున్నారు. సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12లో కూడా నాజ్ పాల్గొన్నారు. నాజ్ యూట్యూబ్ ఛానెల్కు 4.5 మిలియన్ల కంటే ఎక్కువ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా నాజ్ సోదరుడు ఖుర్షీద్ హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అద్నాన్, వాజిద్, జుబేర్ లుగా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరందరు కూడా నాజ్ కు బంధువులు.. సోదరులవుతారు.. వీరిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!