Uttar Pradesh: ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని చంపిన భార్య.. ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ పోసిన వైనం
- ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని చంపిన భార్య
- ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ పోసిన వైనం
- మీరట్లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలు పెనుభూతాలుగా మారి భర్త భార్యను, భార్య భర్తను అంతమొందిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని భార్య హత్య చేసింది. మీరట్లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, దానిపై సిమెంట్ పోసి పూర్తిగా మూసివేశారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read:AP Assembly 2025: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సౌరభ్ రాజ్పుత్ మీరట్లోని ఇందిరానగర్లో తన భార్య ముస్కాన్ రస్తోగి, 5 సంవత్సరాల కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కాగా ముస్కాన్ సాహిల్ అనే యువకుడితో ప్రేమాయణం నడిపిస్తోంది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి సౌరభ్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన అతను అక్కడికక్కడే మరణించాడు. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి, దుర్వాసన రాకుండా సిమెంట్, నీటితో కలిపిన మిశ్రమంతో నింపారు.
Also Read:NEEK : జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ లాక్
ఆ తర్వాత ముస్కాన్ తన భర్తతో కలిసి హిమాచల్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పి, ఇంటికి బయటి నుండి తాళం వేసి వెళ్లిపోయింది. అయితే చాలా రోజులుగా సౌరభ్ కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.
Also Read:Telangana Budget: నేడే తెలంగాణ బడ్జెట్.. రూ. 3.20 లక్షల కోట్ల పైనే పద్దు..?
ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించి, తన ప్రేమికుడు సాహిల్తో కలిసి సౌరభ్ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతికష్టం మీద డ్రమ్ ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపి, నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. కాగా సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కొసమెరుపు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!