దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఈ అంశంపై పార్టీ మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
యూపీ ఉపఎన్నికల్లో విజయం సాధించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. గబంధన్లో దాని మిత్రపక్షమైన ఆర్ఎల్డి మరో స్థానాన్ని గెలుచుకుంది. ఎస్పీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కుందర్కి సీటులో బీజేపీ అతిపెద్ద విజయం సాధించింది. ఈ విజయంతో బీజేపీ 31 ఏళ్ల రాజకీయ కరువుకు తెరపడింది.
ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు…
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.