UP by-Elections: యూపీలోని తొమ్మిది స్థానాల్లో ఏడు సీట్లు ఆ పార్టీకే?
- యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల ఫలితాలు
- రెండింటిలో విజయం సాధించిన ఎస్పీ
- నాలుగు స్థానాల్లో బీజేపీ ఘన విజయం
- మిగతా మూడు స్థానాలకలో బీజేపీ ముందంజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే కాన్పూర్లోని సిసమావు సీటును, మెయిన్పురిలోని కర్హల్ సీటును ఎస్పీ కాపాడుకుంది. కాగా.. అలీఘర్లోని ఖైర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. సురేంద్ర దిలేర్ 38393 ఓట్లతో ఎస్పీపై విజయం సాధించారు. తన విజయం తర్వాత సర్టిఫికెట్ అందుకున్న తర్వాత సంబరాలు చేసుకున్నారు.
READ MORE: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. “మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేం అనుకున్నదానికి విరుద్ధంగా జరిగింది. ఇలాంటి ఫలితాలు ఎందుకు వచ్చాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలో కూటమిలో ఉన్న పార్టీలు దీనిని పరిగణనలోకి తీసుకుంటాయని ఆశిస్తున్నాను.” అని ఆమె తెలిపారు. కాగా.. కుందర్కి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రాంవీర్ సింగ్ ఎస్పీకి చెందిన మహ్మద్ రిజ్వాన్పై భారీ ఆధిక్యం సాధించారు. 22వ రౌండ్ కౌంటింగ్ ముగిశాక బీజేపీ 1,28,375 ఓట్లతో నిర్ణయాత్మక ఆధిక్యం సాధించింది. ఎస్పీకి ఇప్పటివరకు 14,987 ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీకి చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..